విజయవాడ తెలుగుదేశంలో విబేధాలు ఇంకా వీడిపోలేదు. ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ‘విజయవాడ కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరాలన్నదే నా ధ్యేయం. పార్టీ కోసమే నేను కష్టపడుతున్నాను. నా దారిలో నేను వెళ్తున్నాను. విభేదాలు ఉన్నాయని వారుంటున్నారు.. లేవని నేనంటున్నాను. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోను. విమర్శలను వారి విచక్షణకే వదిలేస్తున్నా’ అని బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను ఉద్దేశించి అన్నారు.
‘నా తీరు నచ్చనివారు చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆయన ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేస్తా. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కు ఉంది. నా వెంట ఉన్నది.. నేను ఆత్మ బంధువులుగా భావించేది బీసీలు, ముస్లిం మైనార్టీలే. సీట్ల కేటాయింపులో బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమే విబేధించాను. చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో నాకు సంబంధం లేదు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం రూపొందించాయి. నేను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే సస్పెండ్ చేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తే వారే పోటీ చేస్తారు’ అని అన్నారు.
916247 906168I certainly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 448545
898774 111504Outstanding blog here! Also your internet site loads up fast! What host are you making use of? Can I get your affiliate link to your host? I wish my site loaded up as rapidly as yours lol 920627
419963 586739But wanna comment that you have a quite good internet website , I adore the style and design it truly stands out. 157654