మెట్రో శ్రీధరన్.. మెట్రో మ్యాన్గా భారతీయులందరికీ సుపరిచితుడు. ఇటీవల బీజేపీలో చేరిన శ్రీధరన్, ఏకంగా కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోయారు. నిజానికి, ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నాకనే బీజేపీ అధిష్టానం ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించింది.
కేరళలో అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం కేరళలో వామపక్ష నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో వుంది. మొత్తం 140 శాసనసభ సీట్లకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనుండగా, వామపక్షాలతోపాటు కాంగ్రెస్ కూడా బలంగానే వుంది.
అయితే, కాంగ్రెస్ పార్టీనీ అలాగే వామపక్ష కూటమినీ బలహీనం చేసేందుకోసం బీజేపీ చర్యలు షురూ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సీనియర్ లీడర్లు తాజాగా రాజీనామా చేశారు. వీరంతా బీజేపీలో చేరే అవకాశముంది.
మరోపక్క, కేరళ బీజేపీ నేత కుమ్మనం రాజశేఖన్, కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే, 60 రూపాయలకే లీటర్ పెట్రోలు లభించేలా చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం గమనార్హం. మెట్రో శ్రీధరన్ విషయానికొస్తే, ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక కేరళలో పొలిటికల్ ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతున్నాయి. అంటే, బీజేపీ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతున్నట్టేగా.!
172903 325071Extremely interesting topic , appreciate it for posting . 738136
593692 663115Extremely educating story, saved your website for hopes to read much more! 866095
221346 338860Very interesting subject , appreciate it for posting . 578550