తనపై వున్న 36 కేసుల నుంచి తప్పించుకోవడం కోసం 32 మంది ప్రాణాలు బలిపెడితే వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి సహకరిస్తున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. అనే ఆనాటి నినాదాన్ని, నేటి పాలకులు అభాసుపాలు చేస్తున్నారనీ, పైగా స్టీలు ప్లాంటుకి అనుకూలంగా పోరాటం చేస్తున్నామంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనీ అచ్చెన్నాయుడు విమర్శించారు. మునిసిపల్ ఎన్నికల వేళ, విశాఖ స్టీలు ప్లాంట్ అంశం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
నిజానికి, చంద్రబాబు హయాంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు బీజం పడింది. వైఎస్ జగన్ హయాంలో అది మరింత జోరందుకుంది. కేంద్రం ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెల్సిందే. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయ లబ్ది కోసం పబ్లిసిటీ స్టంట్లు చేయడం తప్ప, ఉద్యమానికి చిత్తశుద్ధితో కూడిన మద్దతునివ్వలేకపోతున్నాయి. టీడీపీ, వైసీపీ.. రెండూ కేంద్రాన్ని నిలదీయలేకపోవడమే ఇందుకు నిదర్శనం.
472808 986597A thoughtful opinion and ideas Ill use on my web page. Youve clearly spent some time on this. Well carried out! 357493