సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నాలుగు నెలలకు పైగా బ్రేక్ తీసుకుందామనుకున్నాడు, అందుకే తర్వాతి సినిమాను వెంటనే ప్రకటించలేదు. అయితే ఈలోగా కరోనా రావడంతో సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. అయితే మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ కెరీర్ లో 27వ సినిమాను ప్రకటించారు. గీత గోవిందం ద్వారా తన కెరీర్ లో తిరుగులేని హిట్ సాధించిన పరశురామ్ దర్శకత్వంలో మహేష్ తన నెక్స్ట్ సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. ప్రీ లుక్ ను కూడా వదిలారు. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేవే.
ఈ సినిమా షూటింగ్ పై ఇంకా అధికారిక సమాచారం లేకపోయినా ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతోంది. ముందుగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీని హీరోయిన్ గా అనుకున్నారు కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో మరో బాలీవుడ్ నటి సయి మంజ్రేకర్ ను తీసుకుందామని భావించారు.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సర్కారు వారి పాటలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఆమైనా ఫైనల్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
335065 430773Average In turn sends provides is the frequent systems that supply the opportunity for ones how does a person pick-up biological, overdue drivers, what one mechanically increases the business. Search Engine Marketing 444851
224809 126411This internet internet site is my aspiration, extremely superb style and style and Perfect topic matter. 955102
729307 8417They call it the self-censor, merely because youre too self-conscious of your writing, too judgmental. 656979
747308 136642really good post, i definitely enjoy this fabulous site, persist with it 787318