జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో కన్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన తనదైన శౖలిలో స్పందించారు. ఘాటైన విమర్శలకు దూరంగా.. అత్యంత బాధ్యతాయుతంగా పలు అంశాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. చాతుర్మాస దీక్ష గురించీ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించీ, రాజధాని అమరావతి గురించీ, రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న ఇళ్ళ వ్యవహారం గురించీ పవన్ కళ్యాణ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
ప్రజా జీవితంలో వున్నాను కాబట్టే.. చాతుర్మాస దీక్ష గురించి అందరికీ తెలిసింది..
ఎన్నో ఏళ్ళుగా చాతుర్మాస దీక్ష చేస్తున్నాను. అయితే, ఇప్పుడు ప్రజా జీవితంలో వున్నాను గనుక, దాని గురించి అందరికీ తెలుస్తోంది. సాత్విక ఆహారం తీసుకోవడం.. నేలపైనే పడుకోవడం.. చాతుర్మాస దీక్షలో ముఖ్యమైన విషయాలు.
కట్టేసి వున్న ఇళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం.?
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల ఇళ్ళ నిర్మాణానికి సహకరించింది. మరో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం కావాల్సి వుంది. భూమి లభ్యత తగ్గినప్పుడు వున్న స్థలంలోనే నిటారుగా ఫ్లాట్లు నిర్మించి, వాటిటిని పేదలకు కేటాయించాల్సి వుంది. చాలా జిల్లాల్లో పలు అంశాలపై తిరిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆయా ఇళ్ళ నిర్మాణాలు చూపించి, వాటిని కేటాయించలేదంటూ నా వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిని సేకరించడం కష్టసాధ్యమైన పని. కొందరి దగ్గర భూమిని లాక్కుని, ఇంకొకరికి పంచాలనుకోవడం సబబుకాదు. ఈ క్రమంలో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టేసి వున్న ఫ్లాట్లను పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం బేషజాలకు పోవడం అస్సలేమాత్రం మంచిది కాదు.
అమరావతికి అప్పుడు ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చేస్తే ఎలా.?
‘మేం ఒక రాజధానికి వ్యతిరేకం, మూడు రాజధానులకు అనుకూలం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పి వుంటే, ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నించడానికి వీల్లేదేమో. కానీ, అమరావతి విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒప్పుకున్నాయి. ఈ క్రమంలోనే రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చింది. రెండు మూడు వేల ఎకరాల భూములు సరిపోయే రాజధాని కోసం, 30 వేల ఎకరాలు సేకరించడం కూడా సబబు కాదు. సింగపూర్ మోడల్ అని చెప్పి అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం అమ్మేస్తే, ఇప్పుడు మూడు రాజధానులంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మేస్తోంది.! అంతిమంగా నష్టపోతున్నది రైతులు మాత్రమే.
దళితులపై దాడులు అమానుషం
రాష్ట్రంలో ఓ దళిత మహిళ హోంమంత్రిగా వున్నారు. కానీ, దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వం, మిగతా కేసుల్లో ఎందుకు అంత వేగంగా స్పందించడంలేదు.? ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం తక్షణం నిందితులపై కరిÄన చర్యలు తీసుకోవాలి. వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేస్తున్నాయి.
కరోనా టెస్టులు ఎక్కువ చేయడం అభినందనీయమేగానీ..
కరోనా వైరస్ టెస్టులు ఎక్కువగా చేస్తున్నందున ప్రభుత్వాన్ని అభినందించాం. మనస్పూÛర్తిగా చేసిన అభినందన అది. అయితే, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. ప్రపంచానికే ఈ పరిస్థితి చాలా కొత్తది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం ఇంకాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ప్రజలకు మేలు జరుగుతుంది. లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టి వుండాల్సింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం బాధాకరం.
ఇలా సాగింది జనసేనాని ఇంటర్వ్యూ.. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయకుండానే, కీలకమైన అంశాల పట్ల తన అభిప్రాయాల్ని, జనసేన పార్టీ విధానాన్ని కుండబద్దలుగొట్టేస్తూ, ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
No matter if some one searches for his necessary thing, thus
he/she needs to be available that in detail, thus that thing
is maintained over here.
263627 712790Thank you for your wonderful post! It has long been incredibly useful. I hope that you will proceed sharing your wisdom with us. 313587
713000 543407Awesome read , Im going to spend much more time researching this subject 797555
388843 610586I got what you mean , saved to bookmarks , extremely decent website. 709919
5790 399921Safest the world toasts are created to captivate and also faithfulness to your wedding couple. Beginner sound system watching high decibel locations would be wise to always remember some sort of vital secret designed by presentation, which is your auto. best man speeches funny 87601