‘‘ఇవన్నీ తుగ్లక్ నిర్ణయాలు.. జగన్ కాదు, జగ్లక్.. హిట్లర్ కి తుగ్గక్ కి ఆయన డూప్ గా మారారు.. వారం వారం కోర్టు బోనులో నిలబడే వ్యక్తి మన సీఎం కావడం దౌర్భాగ్యం..’’ ఇవీ ఇటీవల కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వెల్లువెత్తుతున్న విమర్శలు. నిజానికి అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికల హామీలపై దృష్టి సారించిన ఆయన.. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు. కొన్ని ప్రధాన హామీలను నెరవేరే ప్రయత్నం చేసినా.. పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. కొన్ని హామీలను ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ అలా కాకుండా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పలు హామీలను అమలు చేసి పేరు తెచ్చుకున్నారు. అయితే, మీడియా మద్దతు లేని కారణంగా వీటికి అంతగా ప్రచారం లభించడంలేదు.
ఇదే సమయంలో ఇసుక విధానం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు వంటి అంశాలపై అదే మీడియాలో వ్యతిరేక కథనాలు విపరీతంగా వచ్చాయి. వీటిని ఎదుర్కోవడంలో వైసీపీ విఫలమైందనే చెప్పొచ్చు. దీంతో జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, వాటి కంటే ఇలాంటి వ్యతిరేక కథనాలకే ఎక్కువ ప్రచారం లభిస్తోంది.
ఈ నేపథ్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో జగన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రుల్లో జగన్ నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), రెండో స్థానంలో ఉన్నారు. నితీశ్ కుమార్ (బీహార్) మూడో స్థానంలో ఉన్నారు. ఓ జాతీయ పత్రిక నిర్వహించిన సర్వేలో జగన్ కు మంచి మార్కులు రావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశాన్ని హోరెత్తిస్తున్నారు.
575011 208039Hey. Neat post. There is a problem along with your website in firefox, and you could want to check this The browser is the market chief and a large component of other folks will omit your excellent writing because of this problem. 876919