151 స్థానాల్లో ప్రజలు గెలిపించినందుకు సంతోషపడాలో… మార్చి నెలలో కఠిన పరీక్షలు ఎదుర్కొంటున్నందుకు దుఃఖించాలో తెలియక పాపం జగన్ ఆవేదన చెందుతున్నాడు. మార్చి నెలల్లో జగన్ సర్కార్ చాలా పరీక్షలు ఎదుర్కోబోతున్నట్టు ముందుగానే చెప్పుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యార్థుల పరీక్షల నిర్వహణ, ఇదే నెలల్లో ఖచ్చింతంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ ఇలా అన్ని కూడా ఈ నెలలోనే నిర్వహించాల్సి ఉన్నది.
బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నెలలో నిర్వహించుకునే అవకాశం ఉన్నా ఎందుకో మరి ఆలస్యం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను పైగా గత నెలల్లోనే జరుపుకుంటే బాగుండేది. కానీ, అన్నింటిని ఓకె నెలలో పూర్తి చేస్తే బాగుంటుందనే జగన్ ఆలోచన బెడిసికొట్టింది. కరోనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని, ఎన్నికలు నిర్వహించాలని జగన్ సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.
ఇంతవరకు బాగానే ఉన్నది. ఈనెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవాలి. కానీ, కరోనా ఎఫెక్ట్ తో పాటు దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కుదరనిపని. బడ్జెట్ ఆమోదించకుండా ఏప్రిల్ నుంచి ఒక్కరూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టేందుకు వీలు లేదు. అందుకే బడ్జెట్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను తీసుకురావాలని చూస్తున్నది. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ను ఆమోదింపజేసుకొని కరోనా ప్రభావం తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
76305 241993excellent . Thanks for informations . Ill be back. Thanks again 962004
712389 481298Some truly howling function on behalf with the owner of this web site , dead great topic matter. 553421