మూడు రాజధానుల వ్యవహారం కాదిది.! వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందన్నదానిపై ప్రజా నాడి ఇది.! వైసీపీ, టీడీపీ సొంత సర్వేల్లో తేలుతోన్న విషయమిది. పైకి, ‘సొంతంగా మేమే అధికారంలోకి వస్తాం.. వై నాట్ 175..’ అంటూ టీడీపీ, వైసీపీ చెబుతున్నా, కింది స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి.
‘సంక్షేమ పథకాలు సకాలంలోనే అందుతున్నాయ్.. వైసీపీ పాలన అత్యంత దారుణం.. ఈసారి జనసేనకే ఓటేస్తాం..’ ఇదీ నిఖార్సయిన ప్రజా నాడి.! చాలా సర్వేల్లో.. అందునా, అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సర్వేల్లో ప్రతి ముగ్గురిలోనూ ఫలితం.. ఇదిగో ఇలాగే, మూడు రకాలుగా కనిపిస్తోంది.
ఎలా చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో హంగ్ తప్పేలా కనిపించడంలేదు. అయితే, హంగ్ వైపుగానే రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారా.? అన్నదానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రస్తుతానికైతే ప్రజా నాడి ఇలాగే వుంది.
టీడీపీ సర్వేల్లోనూ జనసేనకు 20 నుంచి 25 సీట్లు వస్తున్నాయ్.. వైసీపీ సర్వేల్లోనూ జనసేనకు అన్నే సీట్లు కనిపిస్తున్నాయ్. రెండు పార్టీల సర్వేల్లోనూ సుమారు 50 సీట్లలో జనసేనకు రెండోస్థానం ఇస్తున్నారు. దీనర్థమేంటి.?
వైనాట్ 175 జస్ట్ అధికార పార్టీ ఆక్రందన మాత్రమే. సొంతంగా అధికారంలోకి వస్తామని టీడీపీ చెబుతున్నదీ గత్యంతరం లేకనే.! అసలంటూ జనసేనాని జనంలోనే వుండటం లేదు కదా.? జనసేనకు ఓట్లు ఎలా పడతాయ్.? అని వైసీపీ, టీడీపీ ప్రశ్నించడంలో వింతేమీ లేదు.
వైసీపీ కంటే, టీడీపీ కంటే.. జనసేన కార్యకర్తలే జనంలో ఎక్కువగా వుంటున్నారు. జనసేన పార్టీ నుంచి ఎవరైనా పోటీ చెయ్యనీ, అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లే లెక్క.. అన్న చర్చ గ్రామ స్థాయిలో జరుగుతోంది.