NTR: కాలం అన్ని గాయాల్నీ నయం చేస్తుందని అంటుంటారు. కానీ, ‘వెన్నుపోటు’ గాయం అనేది ఎప్పటికీ మానదు.! స్వర్గీయ నందమూరి తారక రామారావు విషయంలో జరిగిన రాజకీయ వెన్నుపోటు, ఎప్పటికీ తాజాగానే వుంటుంది. టీడీపీ అనుకూల మీడియా ప్రస్తావించకపోతేనో, చంద్రబాబు భజనలో బాలయ్య మునిగి తేలితేనో.. ఎన్టీయార్ అభిమానులు ఆ గాయాన్ని మర్చిపోతారనుకోవడం హాస్యాస్పదం.
‘చంద్రబాబు వద్దు.. జూనియర్ ఎన్టీయార్ ముద్దు..’ అంటూ కొందరు నందమూరి అభిమానులు, పదే పదే నినదిస్తున్నారు. నిన్నటికి నిన్న స్వర్గీయ ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల వేడుకలోనూ జూనియర్ ఎన్టీయార్ అభిమానులు ఈ హంగామా చేశారు. ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీయార్..’ అంటూ నినదించారు.
ఆ వేదికపై టీడీపీ ప్రస్తుత అధినేత చంద్రబాబు వున్నారు. ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ కూడా వున్నారు. రజనీకాంత్ని పిలిచారు సరే, జూనియర్ ఎన్టీయార్ని ఎందుకు పిలవలేదు.? అని అభిమానుల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కన్నడనాట కూడా జూనియర్ ఎన్టీయార్కి ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది.. ఆ మధ్య ఓ కార్యక్రమంలో. కానీ, తెలుగునాట.. అందునా, స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాల వేడుకలో జూనియర్ ఎన్టీయార్కి చోటు లేకుండా పోయింది.
‘చంద్రబాబు వెన్నుపోటు పర్వం కొనసాగుతూనే వుంది నందమూరి వంశానికి.. బాలయ్య బానిసగా మారిపోయారు చంద్రబాబుకి.! జూనియర్ ఎన్టీయార్ని చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారుగానీ, ఇది ఆ సీనియర్ ఎన్టీయార్ కాలం కాదు.. తగిన మూల్యం చంద్రబాబు చెల్లించుకుంటారు..’ అన్నది నిన్న ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల వేడుక సందర్భంగా నందమూరి అభిమానులు వ్యక్తం చేసిన ఆవేదన.. జస్ట్ ఆవేదన కాదిది, హెచ్చరిక కూడా.!