‘ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ఖచ్చితంగా ధరించాలి.. భౌతిక దూరం పాటించాలి.. సబ్బుతో చేతులు కడుక్కోవాలి.. శానిటైజర్ ఉపయోగించాలి.. వీలైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడొద్దు.. వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలు వాయిదా వేసుకోవాలి.. అత్యవసరమైతే తప్ప.. సాధ్యమైనంత వరకూ అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి..’ చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న బీఎఫ్7(BF7) వేరియంట్ భారత్ లోనూ నాలుగు కేసులు నమోదైన నేపథ్యంలో భారత వైద్యమండలి(IMA) ప్రజల్ని అప్రమత్తం చేసింది.
భారత్ లో కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని పార్లమెంట్లో కేంద్రం చెప్పిన గంటల్లోనే ఐఎంఏ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. గడచిన 24 గంటల్లో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా తదితర దేశాల్లో 5.37 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కొత్తగా 145 కేసులు నమోదైతే 4 బీఎఫ్7 రకానివే. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నమూనాలు సేకరించి, పరీక్షించాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులను వారంపాటు క్వారంటైన్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
45699 848475I like this post, enjoyed this one regards for posting . 301645