అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిమంది తెదేపా కార్యకర్తలు, నందమూరి అభిమానులతో భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ర్యాలీలో బాలయ్యపై అభిమానులు పూల వర్షం కురిపించారు.
నామినేషన్కు ముందు బాలయ్య హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో తన భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు బాలకృష్ణ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు బాలయ్య. 2014లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి కూడా టికెట్ దక్కించుకొని ఎన్నికల బరిలో నిలిచారు.
864116 70386Sweet internet internet site , super pattern , very clean and utilize friendly . 473748
72444 226381I got what you mean ,bookmarked , very nice internet internet site . 453489