ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. మరో రెండు వారాల చిత్రీకరణ తో మొత్తం పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కు కరోనా అడ్డుగా వచ్చింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమాను జులై లో విడుదల చేసే వారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఈ సినిమా గురించి మాత్రం పుకార్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల తో పాటు సోషల్ మీడియాలోని షిప్ సన్నివేశాల గురించి మాట్లాడుతున్నారు. షూటింగ్ ను షిప్ లో పెద్ద ఎత్తున అక్కడ నిర్వహించారు. అందుకే సన్నివేశాలు చాలా హైలైట్ గా వచ్చాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రాధే శ్యామ్ లోని షిప్ సన్నివేశాలు 30 నిమిషాల పాటు కొనసాగుతాయట. ఆ సన్నివేశాల్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. ఆ సన్నివేశాలే సినిమాకు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. సినిమా 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
84286 837194How much of an exciting piece of writing, continue creating companion 40461