మిజోరంలో అస్సాం రైఫిల్స్ సిబ్బంది సాదారణ తనికీల్లో భాగంగా మొత్తం రూ.18 లక్షల విలువైన తలనీలాలను పట్టుకున్న విషయం తెల్సిందే. ఆ తల నీలాలు టీటీడీకి చెందినవిగా మీడియాలో ప్రచారం జరిగింది. తిరుమల శ్రీవారిని మొక్కుకుని తలనీలాలు సమర్పిస్తే అవి కాస్త స్మగ్లింగ్ చేయడం ఏంట్రా బాబు అంటూ టీటీడీ తీరుపై భక్తులు మండి పడుతున్నారు. తల నీలాలను కూడా వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారా అంటూ మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ తనికీల్లో పట్టుబడ్డ తలనీలాలు టీటీడీ నుండి వెళ్లినవి కావని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. అసలు టీటీడీ నుండి అలాంటి స్మగ్లింగ్ కు తిరుమలలో ఛాన్స్ లేదని ఇప్పటికే బోర్డు అధికారులు చెప్పుకొచ్చారు. టీటీడీ ప్రతి మూడు నెలలకు ఒకసారి టెండర్ల ద్వారా తలనీలాలను అమ్మేస్తుంది. ఏ కంపెనీ ఎక్కువ మొత్తంలో కోట్ చేస్తే వారికి తల నీలాలు ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప అక్రమంగా ఎట్టి పరిస్థితుల్లో తల నీలాలు ఇవ్వడం లేదని ఈ సందర్బంగా టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
888263 786004Some times its a discomfort inside the ass to read what blog owners wrote but this internet website is rattling user friendly ! . 802625