Guntur Karam: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Karam) సినిమా నుంచి తొలి సింగిల్ రెడీ అవుతోంది. ఈ మాస్ మసాలా సినిమా నుంచి తొలి పాటను రేపు (నవంబర్ 7) త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు మేకర్స్. ‘దమ్ మసాలా బిర్యానీ’ అనే పాటను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.
ఈ విషయాన్ని చిత్ర బృందం.. ‘ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ.. ఎగబడి ముందరకే వెళ్లిపోతాది నేనెక్కిన బండి’ ప్రోమో ద్వారా అధికారికంగా తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన మహేశ్ మాస్ స్టిల్స్ కు తగ్గట్టు పాట ఉందనే చెప్పాలి. తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్నా సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది.