తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గవర్నర్ నరసింహన్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆమోదించకుండా వెనక్కి పంపించారు. అందులో కొన్ని సవరణలు సూచిస్తూ బిల్లును తిరిగి పంపించారు. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూపొందించిన బిల్లు ఆమోదం కోసం ఈనెల 18, 19వ తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచారు.
ఈ సందర్భంగా కొత్త బిల్లులోని విశేషాలను కూలంకషంగా సభకు వివరించారు. అయితే, ఈ బిల్లులో మున్సిపాలిటీలపై కలెక్టర్లకు విశేష అధికారాలను కల్పించడాన్ని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. దానివల్ల ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా విపక్ష సభ్యులపై కక్ష సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అయినప్పటికీ, వారి సూచనలు బేఖాతరు చేస్తూ కొత్త మున్సిపల్ చట్టాన్ని సభ ఆమోదించింది. దీంతో విపక్ష సభ్యులు గవర్నర్ ను కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.
కలెక్టర్లకు విస్తృతాధికారాలు కల్పించడం మంచిది కాదని ఆయన ధృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన బిల్లును నిశితంగా పరిశీలించిన గవర్నర్.. కొన్ని సవరణలు సూచిస్తూ దానిని వెనక్కి పంపించారు. దీంతో నైతికంగా విపక్షాలు ప్రభుత్వంపై పైచేయి సాధించనట్టయింది. గవర్నర్ బిల్లును వెనక్కి పంపడంతో సర్కారు చేసేది ఏమీ లేక ఆయన చేసిన సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై గవర్నర్ సంతృప్తి చెందితే, ఆయన దానిని ఆమోదించి కేంద్రానికి పంపిస్తారు. అక్కడ కూడా అది ఆమోదం పొందితే రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వస్తుంది.
741108 484300Some truly good stuff on this web site , I like it. 573322