ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక, ఆంధ్రప్రదేశ్లో ఇదే తొలి సస్పెన్షన్ వేటు కావడం గమనార్హం. మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యుల్ని స్పీకర్ ఛెయిర్లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సస్పెండ్ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై చర్చ సందర్భంగా అధికార పక్షం – ప్రతిపక్షం మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో అధికారపక్షం తాము ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఓ వీడియోని అసెంబ్లీలో ప్రదర్శించింది. అయితే, తమ వీడియోని కూడా ప్రదర్శించాలంటూ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. తాము తెచ్చిన వీడియో ప్రదర్శిస్తే, వైఎస్ జగన్ సర్కార్ ప్రజల్ని మోసగిస్తున్న వైనం బయటపడ్తుందంటూ టీడీపీ శాసనసభ్యులు నినదించడంతో సభలో గలాటా చోటు చేసుకుంది. అధికార – ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదులాట తారాస్థాయికి చేరడంతో, చివరికి ముగ్గురు సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్.
కాగా, సమాధానం చెప్పడం చేతకాక వైఎస్ జగన్ ప్రభుత్వం తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందంటూ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సభలో అధికార పక్షం తాలూకు వీడియోలు మాత్రమే ప్రదర్శిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అసెంబ్లీలో అధికార పక్షం అసహనానికి హద్దుల్లేకుండా పోతోందని ఆయన మండిపడ్డారు.
మరోపక్క, సభలో సస్పెండ్ చేసే పరిస్థితిని తెచ్చుకోవడం బాధాకరమంటూ అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు అంబటి రాంబాబు, అసెంబ్లీ లాబీల్లో తనకు ఎదురైన అచ్చెన్నాయుడు తదితరుల్ని ఉద్దేశించి మాట్లాడారట. ‘మీ ప్రభుత్వానికి అసహనమెక్కువైపోయింది’ అంటూ సస్పెండ్ అయిన సభ్యులు అంబటికి చెప్పారట. దాంతో ఆయన మారు మాట్లాడకుండా అసెంబ్లీలోకి వెళ్ళిపోయారట.
మొత్తమ్మీద, సస్పెండ్ అవడం అనేది శాసనసభ్యులకు కొత్తేమీ కాకపోయినా, మార్పు దిశగా సరికొత్త రాజకీయాలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్.. అసెంబ్లీ ఎలా వుండాలో తాము చూపిస్తామంటూ జబ్బలు చర్చుకున్న వైఎస్ జగన్, 23 మంది సభ్యులున్న ప్రతిపక్షం నుంచి వచ్చే వాయిస్ని తట్టుకోలేనంత అసహనానికి గురవడం హాస్యాస్పదమే.
780968 224317cool thanks for reis posting! btw are there feeds to your blog? Id enjoy to add them to my reader 61344