Switch to English

23 మంది సభ్యుల్ని తట్టుకోలేక.. జగన్‌ సర్కార్‌ అసహనం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్‌ చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలి సస్పెన్షన్‌ వేటు కావడం గమనార్హం. మొత్తం బడ్జెట్‌ సమావేశాల నుంచి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యుల్ని స్పీకర్‌ ఛెయిర్‌లో కూర్చున్న డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సస్పెండ్‌ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోపై చర్చ సందర్భంగా అధికార పక్షం – ప్రతిపక్షం మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో అధికారపక్షం తాము ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఓ వీడియోని అసెంబ్లీలో ప్రదర్శించింది. అయితే, తమ వీడియోని కూడా ప్రదర్శించాలంటూ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. తాము తెచ్చిన వీడియో ప్రదర్శిస్తే, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ప్రజల్ని మోసగిస్తున్న వైనం బయటపడ్తుందంటూ టీడీపీ శాసనసభ్యులు నినదించడంతో సభలో గలాటా చోటు చేసుకుంది. అధికార – ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదులాట తారాస్థాయికి చేరడంతో, చివరికి ముగ్గురు సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు డిప్యూటీ స్పీకర్‌.

కాగా, సమాధానం చెప్పడం చేతకాక వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసిందంటూ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సభలో అధికార పక్షం తాలూకు వీడియోలు మాత్రమే ప్రదర్శిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ, అసెంబ్లీలో అధికార పక్షం అసహనానికి హద్దుల్లేకుండా పోతోందని ఆయన మండిపడ్డారు.

మరోపక్క, సభలో సస్పెండ్‌ చేసే పరిస్థితిని తెచ్చుకోవడం బాధాకరమంటూ అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు అంబటి రాంబాబు, అసెంబ్లీ లాబీల్లో తనకు ఎదురైన అచ్చెన్నాయుడు తదితరుల్ని ఉద్దేశించి మాట్లాడారట. ‘మీ ప్రభుత్వానికి అసహనమెక్కువైపోయింది’ అంటూ సస్పెండ్‌ అయిన సభ్యులు అంబటికి చెప్పారట. దాంతో ఆయన మారు మాట్లాడకుండా అసెంబ్లీలోకి వెళ్ళిపోయారట.

మొత్తమ్మీద, సస్పెండ్‌ అవడం అనేది శాసనసభ్యులకు కొత్తేమీ కాకపోయినా, మార్పు దిశగా సరికొత్త రాజకీయాలు చేస్తామని చెప్పిన వైఎస్‌ జగన్‌.. అసెంబ్లీ ఎలా వుండాలో తాము చూపిస్తామంటూ జబ్బలు చర్చుకున్న వైఎస్‌ జగన్‌, 23 మంది సభ్యులున్న ప్రతిపక్షం నుంచి వచ్చే వాయిస్‌ని తట్టుకోలేనంత అసహనానికి గురవడం హాస్యాస్పదమే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...