Gautam Gambir: ధోనీ (Dhoni) ని కావాలనే హీరోని చేశారని.. ఆయన పీఆర్ టీమ్ చేసిన కృషితోనే ఆ పేరు వచ్చిందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambir) విమర్శించారు. జట్టు సమిష్టిగా రాణించినా ఆ విజయాన్ని ధోనీ (Dhoni) కి ఆపాదించారని తీవ్రంగా స్పందించారు. 2007, 2011 ప్రపంచకప్ గెలుపులో టీమ్ సమిష్టిగా రాణిస్తే.. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకే ఆ ఖ్యాతిని అప్పజెప్పారని మండిపడ్డారు. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్లో భారత్ (India) ఓడిపోతే.. ఈ ట్రోఫీల్లో గెలవడం ధోనీ ఉంటేనే సాధ్యమనే వాదనను గంభీర్ కొట్టిపారేశారు.
‘మన వ్యక్తిగత ప్రదర్శనపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఈ లోపంతోనే వైఫల్యాలు దక్కుతాయి. ఇతర జట్లు సమిష్టి కృషికి ప్రాధాన్యమిస్తే.. మనం వ్యక్తిగతంగా ఇస్తున్నాం. 2007, 2011 ప్రపంచకప్ లో భారత్ విజేతగా అవతరించిందంటే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రధాన కారకుడు. యూవీ ప్రతిభ వల్లే ఫైనల్ వరకూ వచ్చాం.. కప్ గెలిచాం. కానీ.. పీఆర్ ఏజెన్సీలు మాత్రం ధోనీనే హీరోని చేశాయి’ అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.