దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ తీవ్రత తగ్గటం లేదు. నిన్న ఒక్కరోజే 50వేలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా తీవ్రత తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణలో కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది.
అయితే.. కొంతమంది వ్యక్తిగత జాగ్రత్త పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కొంత కారణమవుతోంది. రాష్ట్రంలో కొంతమంది వైరస్ నిర్దారణ అయ్యాక ఫోన్ స్విచ్చాఫ్ చేయడం.. తప్పు అడ్రస్ ఇవ్వడం చేస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో చేరకుండా తప్పించుకుంటున్నారు. దీంతో వారి వల్ల వైరస్ వ్యాప్తి కూడా జరుగుతోందని గుర్తించింది తెలంగాణ వైద్యశాఖ. కొంతమంది వైరస్ ను దాచిపెడుతున్నారని కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో టీఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై ఇటువంటి వారిని గుర్తించేందుకు పోలీసుల సాయం తీసుకోనుంది. ఆస్పత్రుల్లో చేరని పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించేందుకు పోలీసులే రంగంలోకి దిగబోతున్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి ఆచూకి తెలుసుకోనున్నారు. అటువంటి వారిని ట్రాక్ చేసి ఆసుపత్రుల్లో చేర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
874376 129375But wanna say that this is invaluable , Thanks for taking your time to write this. 353091
686453 416745Wonderful post is going to be posting this on my blog today keep up the good work. 812058
329037 990547Hi there. Very cool web site!! Guy .. Beautiful .. Great .. I will bookmark your site and take the feeds additionallyI am glad to locate so significantly useful information correct here inside the post. Thanks for sharing 177761