తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఇటీవలే ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ మృతి చెందగా ఇటీవలే ప్రముఖ గాన రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ మృతి చెందారు. ఆ విషయం నుండి బయటకు రాకుండానే మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందారు. వృద్యాప్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా రోశయ్య బాధపడుతున్నారు.
ఆయన నేడు ఉదయం తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. పలువురు ముఖ్యమంత్రుల మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసిన రోశయ్య సీఎం వైఎస్సార్ మృతి చెందిన సమయంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కొన్నాళ్లు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంకు వ్యవహరించిన రోశయ్య ఆ తర్వాత తమిళనాడు కు గవర్నర్ గా వెళ్లారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన రోశయ్య మృతి ఆ పార్టీ ముఖ్య నేతలకు తీవ్ర దిగ్ర్బాంతిని కలిగించింది. ఆయన కు కాంగ్రెస్ అధినాయకత్వం నివాళ్లు అర్పించింది.
208515 13718This internet web site may possibly be a walk-through for all of the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will definitely discover it. 536680