Switch to English

భారీగా పెరగనున్న ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదో తీపి కబురు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వీరు పొందే పెన్షన్ భారీగా పెరగనుంది. ఇందుకు సంబంధించి అధిక పెన్షన్ పొందే దిశగా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ప్రైవేటు ఉద్యోగులకు వారి వేతనం ఆధారంగా పెన్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

దీంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే పింఛన్ భారీగా పెరగనుంది. ఉద్యోగ విరమణ చేసిన సమయంలో సదరు ఉద్యోగి పొందుతున్న పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలని ఇటీవల కేరళ హైకోర్టు ఈపీఎఫ్ఓని ఆదేశించింది. నెలకు గరిష్టంగా రూ.15వేలకు మాత్రమే పెన్షన్ లెక్కించి ఇస్తున్న పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టంచేసింది.

దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సరైన కారణాలేవీ తమకు కనబటంలేదని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. దీంతో కేరళ హైకోర్టు ఆదేశాలను ఈపీఎఫ్ఓ అమలు చేయాల్సి ఉంది. అయితే, ఇకపై అదనపు కాంట్రిబ్యూషన్ మొత్తం పింఛను నిధికి కాకుండా ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) వైపు వెళుతుంది.

దీంతో పీఎఫ్ కార్పస్ తగ్గి, ఆ మేరకు ఈపీఎస్ పెరుగుతుంది. పీఎఫ్ మొత్తం తగ్గినప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. అక్కడ తగ్గిన మొత్తం ఈపీఎస్ లో పెరుగుతుంది కాబట్టి, పెద్దగా తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం 1995లో ఈపీఎస్ ను ప్రారంభించింది. దీని ప్రకారం సంస్థలు తమ ఉద్యోగుల వేతనంలో 8.33 శాతాన్ని ఈపీఎస్ లో జమ చేయాలి. గరిష్టంగా రూ.6,500 మొత్తంలో 8.33 శాతం లేదా నెలకు రూ.541 గా ఇది ఉండేది. 1996లో ఈ చట్టానికి సవరణ చేసి, ఉద్యోగికి వచ్చే పూర్తి వేతనం ఆధారంగా 8.33 శాతం మొత్తాన్ని లెక్కించి ఈపీఎస్ లో జమ చేయాలని కేంద్రం నిబంధనలు విధించింది.

అయితే, 2014 సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ నిబంధనలను ఈపీఎఫ్ఓ సవరించింది. పింఛను మొత్తాన్ని గరిష్టంగా నెలకు రూ.15 వేల వేతనంలో 8.33 శాతం లేదా రూ.1250 గా లెక్కగట్టి జమచేయాలని పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓ మెలిక పెట్టింది. పూర్తిస్థాయి వేతనం ఆధారంగా ఈపీఎస్ పొందాలనుకునే ఉద్యోగుల గత ఐదేళ్ల వేతన సగటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

ఇంతకుముందు ఉన్నట్టుగా గత ఏడాదిగా పొందిన వేతన సగటు ఆధారంగా ప్రయోజనాలు పొందలేరని స్పష్టంచేసింది. ఈ నిబంధన వల్ల ఉద్యోగుల పెన్షన్ తగ్గిపోతుంది. దీంతో పలువురు ఉద్యోగులు ఈ నిర్ణయంపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీనాటి ఈపీఎఫ్ఓ ఉత్తర్వులను కొట్టివేసింది. పాత పద్ధతి ప్రకారం ఉద్యోగుల గత ఏడాది వేతన సగటు ఆధారంగానే పెన్షన్ లెక్కించాలని ఆదేశించింది.

అయితే, వీటిని సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడా చుక్కెదురైంది. ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలంటూ 2016 అక్టోబర్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఈపీఎఫ్ఓ మాత్రం ట్రస్టుల ద్వారా ఈపీఎఫ్ నిర్వహణ జరుగుతున్న ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ వంటి నవరత్న కంపెనీలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని నిర్ణయించింది.

దీనిపై అభ్యంతరాలు రావడంతో కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇక ఉద్యోగులకు వారి పూర్తి వేతన ఆధారంగానే పెన్షన్ లభించనుంది. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరినవారు కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రవీణ్ కోహ్లీ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రస్తుతం రూ.2,372 పింఛన్ అందుకుంటుండగా.. ఇకపై అతడికి రూ.30,592 పెన్షన్ అందనుంది. సర్వీసులో ఉన్న సంవత్సరాలు, చివరగా డ్రా చేసిన వేతనం ఆధారంగా ఆయా ఉద్యోగుల పెన్షన్లను లెక్కగట్టనున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...