ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదో తీపి కబురు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వీరు పొందే పెన్షన్ భారీగా పెరగనుంది. ఇందుకు సంబంధించి అధిక పెన్షన్ పొందే దిశగా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ప్రైవేటు ఉద్యోగులకు వారి వేతనం ఆధారంగా పెన్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
దీంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే పింఛన్ భారీగా పెరగనుంది. ఉద్యోగ విరమణ చేసిన సమయంలో సదరు ఉద్యోగి పొందుతున్న పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలని ఇటీవల కేరళ హైకోర్టు ఈపీఎఫ్ఓని ఆదేశించింది. నెలకు గరిష్టంగా రూ.15వేలకు మాత్రమే పెన్షన్ లెక్కించి ఇస్తున్న పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టంచేసింది.
దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సరైన కారణాలేవీ తమకు కనబటంలేదని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. దీంతో కేరళ హైకోర్టు ఆదేశాలను ఈపీఎఫ్ఓ అమలు చేయాల్సి ఉంది. అయితే, ఇకపై అదనపు కాంట్రిబ్యూషన్ మొత్తం పింఛను నిధికి కాకుండా ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) వైపు వెళుతుంది.
దీంతో పీఎఫ్ కార్పస్ తగ్గి, ఆ మేరకు ఈపీఎస్ పెరుగుతుంది. పీఎఫ్ మొత్తం తగ్గినప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. అక్కడ తగ్గిన మొత్తం ఈపీఎస్ లో పెరుగుతుంది కాబట్టి, పెద్దగా తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం 1995లో ఈపీఎస్ ను ప్రారంభించింది. దీని ప్రకారం సంస్థలు తమ ఉద్యోగుల వేతనంలో 8.33 శాతాన్ని ఈపీఎస్ లో జమ చేయాలి. గరిష్టంగా రూ.6,500 మొత్తంలో 8.33 శాతం లేదా నెలకు రూ.541 గా ఇది ఉండేది. 1996లో ఈ చట్టానికి సవరణ చేసి, ఉద్యోగికి వచ్చే పూర్తి వేతనం ఆధారంగా 8.33 శాతం మొత్తాన్ని లెక్కించి ఈపీఎస్ లో జమ చేయాలని కేంద్రం నిబంధనలు విధించింది.
అయితే, 2014 సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ నిబంధనలను ఈపీఎఫ్ఓ సవరించింది. పింఛను మొత్తాన్ని గరిష్టంగా నెలకు రూ.15 వేల వేతనంలో 8.33 శాతం లేదా రూ.1250 గా లెక్కగట్టి జమచేయాలని పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓ మెలిక పెట్టింది. పూర్తిస్థాయి వేతనం ఆధారంగా ఈపీఎస్ పొందాలనుకునే ఉద్యోగుల గత ఐదేళ్ల వేతన సగటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
ఇంతకుముందు ఉన్నట్టుగా గత ఏడాదిగా పొందిన వేతన సగటు ఆధారంగా ప్రయోజనాలు పొందలేరని స్పష్టంచేసింది. ఈ నిబంధన వల్ల ఉద్యోగుల పెన్షన్ తగ్గిపోతుంది. దీంతో పలువురు ఉద్యోగులు ఈ నిర్ణయంపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీనాటి ఈపీఎఫ్ఓ ఉత్తర్వులను కొట్టివేసింది. పాత పద్ధతి ప్రకారం ఉద్యోగుల గత ఏడాది వేతన సగటు ఆధారంగానే పెన్షన్ లెక్కించాలని ఆదేశించింది.
అయితే, వీటిని సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడా చుక్కెదురైంది. ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలంటూ 2016 అక్టోబర్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఈపీఎఫ్ఓ మాత్రం ట్రస్టుల ద్వారా ఈపీఎఫ్ నిర్వహణ జరుగుతున్న ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ వంటి నవరత్న కంపెనీలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని నిర్ణయించింది.
దీనిపై అభ్యంతరాలు రావడంతో కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇక ఉద్యోగులకు వారి పూర్తి వేతన ఆధారంగానే పెన్షన్ లభించనుంది. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరినవారు కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రవీణ్ కోహ్లీ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రస్తుతం రూ.2,372 పింఛన్ అందుకుంటుండగా.. ఇకపై అతడికి రూ.30,592 పెన్షన్ అందనుంది. సర్వీసులో ఉన్న సంవత్సరాలు, చివరగా డ్రా చేసిన వేతనం ఆధారంగా ఆయా ఉద్యోగుల పెన్షన్లను లెక్కగట్టనున్నారు.
950972 513595Thank you for your really good info and feedback from you. san jose used car 76183
622941 217467Thank you for sharing with us, I believe this site genuinely stands out : D. 511083
922769 788767Extremely good design and style and fantastic topic matter, very small else we want : D. 627143
458951 140302so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 75057