పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పసగడి రాంబాబు అనే వ్యక్తి తాగిక మైకంలో భార్య మరియు 25 ఏళ్ల కొడుకు అచ్చారావుపై గొడ్డలితో దాడి చేశాడు. ఆ దాడిలో అచ్చారావు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగామృతి చెందాడు. రాంబాబు భార్య మాత్రం ప్రస్తుతం ప్రాణాలతో పోరాటం సాగిస్తుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యులు తెలియజేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాంబాబు కుటుంబ వివాహాది శుభాకార్యాలకు వంటలు చేస్తూ ఉంటారు. ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు పెళ్లి అయ్యి విడిగా ఉంటున్నాడు. భార్య మరియు చిన్న కొడుకుతో కలిసి రాంబాబు సొంత ఇంట్లో మరో పోర్షన్ లో ఉంటున్నారు. ఈమద్య కాలంలో తరచు గొడవలు అవుతున్నాయి. మంగళవారం రాత్రి గొడవలు శృతి మించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. చేతికి అందిన గొడ్డలిని రాంబాబు అందుకుని కొడుకు భార్య అనే విచక్షణ లేకుండా తెగనరికాడు. దాంతో అక్కడికి అక్కడే ఇద్దరు కూడా కుప్పకూలారు. పెద్ద కొడుకు వారిని 108లో ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి రాంబాబును అరెస్ట్ చేశారు.
475724 830645I like the helpful info you supply within your articles. Ill bookmark your weblog and check once again here regularly. Im quite certain I will learn lots of new stuff correct here! Finest of luck for the next! 715332