అర్థరాత్రి ఓ మహిళ స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా తిరగగలిగిన నాడే దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లంటూ మహనీయులు చెప్పారు. కానీ, పట్ట పగలు ఓ యువతి నడి రోడ్డు మీద తిరగలేని దుస్థితి. అదీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఓ వైపు జరుగుతోంటే, ఇంకో వైపు ఓ యువతిని నడి రోడ్డు మీద చంపేశాడో యువకుడు. చుట్టూ బోల్డంతమంది జనం వున్నారు. ఎవరూ ఈ హత్యను ఆపలేకపోయారు. వేడుక చూశారని అనలేంగానీ, తెగువ చూపి యువతిని రక్షించి.. హంతకుడ్ని పట్టుకోలేకపోయారు.
జనం సంగతి తర్వాత, ‘దిశ’ ఏం చేస్తోంది.? రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళ.. కష్టంలో వున్నా, పోలీసులు అక్కడ క్షణాల్లో వాలిపోతారు.. అంటూ ‘దిశ’ చుట్టూ అదికార వైసీపీ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పోలీసు విభాగంలో ‘దిశ’ అనే ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీనికీ పార్టీ రంగులు పులిమేశారనుకోండి.. అది వేరే విషయం. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి ఓ యాప్ అందుబాటులో వుండేది. పేరు మారింది.. పబ్లిసిటీ పెరిగింది తప్ప, ఈ యాప్ ద్వారా మహిళలకు లభిస్తున్న రక్షణ నిజమేనా.? అన్నదానికి మాత్రం సరైన సమాధానం దొరకడంలేదు.
హోంమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వుంటోన్న జిల్లాలో ఈ దారుణం జరిగింది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూత వేటు దూరంలో, చీకటి పడుతున్న సమయంలో ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ‘దిశ’ చుట్టూ పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ఇంతలోనే, ఇదిగో దళిత యువతి రమ్య హత్యకు గురైంది. లోపం ఎక్కడుంది.? ప్రభుత్వ విధానాల్లో లోపమా.? పోలీసు వ్యవస్థలో వైఫల్యమా.?
విపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసుల్ని విరివిగా వాడుతున్న అధికార పక్షం, ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో మాత్రం పూర్తిస్థాయిలో విఫలమవుతోంది. ‘గన్ కంటే.. గన్లోని బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తారు..’ అంటూ మహిళల రక్షణ విషయమై సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు సందర్భాల్లో చెప్పారు. ఎదీ.? ఎక్కడ.? ఒకదాని తర్వాత ఇంకోటి.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు.. హత్యాచారాలు.. జరుగుతూనే వున్నాయి. ఘటన జరిగిన ప్రతిసారీ ప్రభుత్వం తరఫున డబ్బు వెదజల్లితే సరిపోదు.
గడచిన రెండేళ్ళలో ఇలాంటి ఎన్ని కేసుల్లో దోషులకు శిక్ష వేశారో వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సి వుంది. సుగాలి ప్రీతి హత్య వ్యవహారం తేలలేదు. అక్కడిదాకా ఎందుకు.? వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యకు గురైతే, ఇంతవరకు దోషులెవరో గుర్తించలేకపోయారు. అన్నట్టు, వైఎస్ జగన్ మీద చంద్రబాబు హయాంలో జరిగిన కోడి కత్తి దాడి మిస్టరీని ఛేదించలేకపోయారు. ఇదీ జగనన్న ఘనమైన పాలన.
కొసమెరుపేంటంటే, గుంటూరులో పట్టపగలు దళిత యువతి అత్యంత పాశవికంగా హత్యకు గురైతే.. ఇంకోపక్క ప్రభుత్వ పెద్దలు తమ పని తాము చేసుకుపోతున్నారు.. పత్రికల్లో, న్యూస్ ఛానళ్ళలో ప్రకటనలతో (స్కూళ్ళకు సంబంధించి) తమ ఘనతల తాలూకు పబ్లిసిటీలో మునిగిపోయారు. ఇదీ సమాజం పట్ల వారికున్న బాధ్యత.
458816 531653Admiring the time and energy you put into your weblog and in depth information you offer. Its excellent to come across a blog every once in a whilst that isnt exactly the same old rehashed material. Fantastic read! Ive bookmarked your internet site and Im adding your RSS feeds to my Google account. 984610
501445 557409Woh Every person loves you , bookmarked ! My partner and i take problem in your last point. 467826
882987 920600If running proves to be a problem then it may be wise to find alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 257896