తెలుగుదేశం పార్టీకి మరో ముఖ్య నేత గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. ఆగస్ట్ నెల ముగిసేటప్పటికి టీడీపీలో ఎంతమంది నేతలు మిగులుతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం పొంచి వుంది మరి. తాజాగా కృష్ణా జిల్లాకి చెందిన పలువురు ముఖ్య నేతలు టీడీపీని వీడే ఆలోచనలో వున్నారట. అందులో బొండా ఉమామహేశ్వరరావు ఆల్రెడీ జంపింగ్ సంకేతాలు పంపించేశారు.. మరోపక్క, టీడీపీ యువ నేత, ఇటీవల గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ ఆల్రెడీ టీడీపీకి గుడ్ బై చెప్పేశారంటూ ప్రచారం జరుగుతోంది.
అధినేత చంద్రబాబుకి ఈ మేరకు దేవినేని అవినాష్ రాజీనామా లేఖాస్త్రాన్ని పంపించారనీ, త్వరలో ఆయన వైసీపీలో చేరబోతున్నారనీ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దేవినేని అవినాష్ సన్నిహితుల్లో కొందరు ఈ విషయాన్ని ధృవీకరిస్తోంటే, మరికొందరు ఖండిస్తున్నారు. కాగా, దేవినేని అవినాష్ పార్టీ మారడం ఖాయమనీ, వైఎస్ జగన్ విదేశాల నుంచి రాగానే ఆయన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనీ తెలుస్తోంది.
అదే సమయంలో ఆయన రాకను మంత్రి కొడాలి నాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే వాదనలూ లేకపోలేదు. ఇదిలా వుంటే, దేవినేని అవినాష్ ప్లాన్-ఎ మాత్రమే కాదు, ప్లాన్-బితో కూడా సిద్ధంగా వున్నారట. వైసీపీతోపాటు, బీజేపీతోనూ ఆయన సమాంతరంగా చర్చలు జరుపుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత దేవినేని అవినాష్. ఇటీవలి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. భారీగా ఖర్చు చేశారు కూడా. అయితే, టీడీపీలో కొనసాగడం వల్ల భవిష్యత్తు లేదనే ఆలోచనతోనే ఆయన పార్టీ మారాలన్న ఆలోచన చేస్తున్నారట.
కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయమై జరుగుతున్న రాద్ధాంతం నేపథ్యంలో ఆయనా కొంత ఆందోళనతో వున్నారట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం బీజేపీతో టచ్లోకి వెళ్ళిన విషయమే. ఏమో, ఎప్పుడు ఏ వికెట్ పడుతుందోగానీ.. ‘ఈయన పార్టీ మారరు..’ అని ఖచ్చితంగా ఎవరి గురించీ టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మకం ప్రదర్శించలేని పరిస్థితి నెలకొంది.
825985 616136I respect your piece of function, appreciate it for all of the intriguing content . 47734
264666 589143But a smiling visitor here to share the enjoy (:, btw excellent pattern . 855905