ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో విధులు నిర్వహించే అధికారి పీఎం కేర్స్ అనేది భారత ప్రభుత్వానికి చెందినది అనే అంశంపై నేడు ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైమ్ మినిస్టర్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ (పీఎం కేర్స్) ఫండ్ అనేది చట్ట ప్రకారం ఛారిటబుల్ ట్రస్ట్ అని.. ఈ ఫండ్కు వచ్చే నిధులు భారత ప్రభుత్వానికి చెందవని.. భారత సంచిత నిధికి వెళ్లవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈసంధర్బంగా కోర్టు స్పందిస్తూ.. ఇకపై ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనే పదాలు వాడటం తగ్గించుకోవాలని కూడా సూచించింది. గతంలో కేంద్ర సమాచార అధికారి పీఎం కేర్స్కు సంబంధించిన పత్రాలు అందజేయాలని కోరడంతో పీఏంవో కార్యాలయం తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో విధులు నిర్వహించే ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ అనే అధికారి ఒక ఆఫిడవిట్ను దాఖలు చేశారు. పీఏం కేర్స్ అనేది ట్రస్ట్ అని.. ఈ ట్రస్ట్ పారదర్శకంగా పనిచేస్తుందని అన్నారు. ఈ ట్రస్ట్కు అందే నిధులను ఒక ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆడిట్ చేస్తారని పేర్కొన్నారు. ఆడిట్ నివేదికను వెబ్సైట్లో ఉంచుతున్నామని కోర్టుకు విన్నవిస్తూ.. పీఎం కేర్స్ ఫండ్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం స్టేట్ నిధిగా గుర్తించాలన్నారు. ఈ ట్రస్ట్ను రాజ్యాంగం ప్రకారం గుర్తిస్తే సమాచార హక్కు చట్టం కింద వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని అన్నారు.
58969 829507I always was interested in this subject and still am, thankyou for posting . 445350
21017 835158Quite informative and outstanding bodily structure of content material material , now thats user friendly (:. 951008