తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొన్నేళ్లుగా వారికి కల్పిస్తున్న వసతి సౌకర్యం కట్ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించనుంది.
వీరందరికీ వచ్చే నెల నుంచి ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో వసతి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతి కల్పించనుంది. ఇప్పటివరకు షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించింది.
వీరంతా రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్లోని ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి ఫిఫ్ట్ అయ్యారు. దీంతో.. అప్పటి నుంచి వారికి ప్రభుత్వమే ఉచిత ట్రాన్సిట్ వసతి కల్పించింది. ఇప్పుడా సౌకర్యాన్ని జగన్ ప్రభుత్వం తొలగించడంతో వీరందరికి షాక్ తగిలినట్టైంది.
602125 426549Great weblog right here! Additionally your website so much up fast! 661951
872932 243371Thank you for your very very good information and feedback from you. car dealers san jose 327304
963819 872149I agree together with your points , great post. 459376