తెలుగుదేశం పార్టీ శాసన మండలి రద్దు – మూడు రాజధానుల వ్యవహారం – సీఆర్డీఏ ఉప సంహరణ బిల్లు అంశాలపై చివరి అస్త్రాన్ని కూడా సంధించేసింది. శాసన మండలి ఛైర్మన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ని కలిసి, తాజా పరిణామాలపై చర్చించారు.. మండలి ఛైర్మన్గా తన ఆదేశాల్ని మండలి కార్యదర్శి బేఖతారు చేయడంపై ఫిర్యాదు కూడా చేశారు. ఇది టీడీపీ వ్యూహాలకు సంబంధించి ‘చివరి ప్రయత్నం’గా చెప్పుకోవాలేమో.!
ఎందుకంటే, శాసన మండలి రద్దు దిశగా ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. ‘బంతి’ ఇప్పుడు కేంద్రం కోర్టులో వుంది. మరోపక్క, మూడు రాజధానులు (వికేంద్రీకరణ బిల్లు) – సీఆర్డీయే ఉప సంహరణ బిల్లులకు సంబంధించి మండలి ఛైర్మన్, సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని ప్రభుత్వం తనకున్న బలంతో లైట్ తీసుకుంది. కార్యదర్శి ద్వారా మండలి ఛైర్మన్, సెలక్ట్ కమిటీలపై ఇచ్చిన ఆదేశాల్ని తిప్పి పంపేలా చేయగలిగింది.
కాగా, మండలి రద్దు విషయమై కేంద్రం, జగన్ ప్రభుత్వం పట్ల సానుకూలంగా వుందన్న ప్రచారం వైసీపీ నుంచి గట్టిగా జరుగుతోంది. ఎలాగూ, గవర్నర్ కేంద్రం ఆలోచలకు భిన్నంగా వ్యవహరించే అవకాశం వుండకపోవచ్చు. సో, వైసీపీ వాదనే నిజమైతే, టీడీపీ చివరి అస్త్రం కూడా ఫెయిల్ అవనుండడం ఖాయం. కానీ, మండలి ఛైర్మన్ ఆదేశాల్ని మండలి కార్యదర్శి బేఖాతరు చేయడం, దాంతో మండలి ఛైర్మన్ స్వయంగా గవర్నర్కి తాజా పరిణామాలపై ఫిర్యాదు చేయడం.. అనేది గతంలో ఎన్నడూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందర్భం లేదు.
సో, ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ గవర్నర్ గనుక, ఈ వ్యవహారంపై సీరియస్గా స్పందించి, అధికార పార్టీకి ఝలక్ ఇస్తే.. వికేంద్రీకరణ, సీఆర్డీయే ఉప సంహరణ బిల్లులకూ ఝలక్ తగిలినట్లే అవుతుంది.
26 868538educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 833517
678582 397990so a lot wonderful information on here, : D. 470409