తెలంగాణలో కరోనా కేసులు దాదాపు అదుపులోకి వచ్చాయనుకుంటున్న తరుణంలో ఆ మహమ్మారి కన్నెర్రజేసింది. ఒక్కరోజే ఏకంగా 79 కేసులు నమోదు కావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణలో కేసులు వెలుగు చూడటం మొదలైన తర్వాత ఇంత తీవ్రస్థాయిలో పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు అత్యధికంగా ఒకేరోజు 75 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దానిని అధిగమించి 79 కేసులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిజానికి కరోనా కేసులు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తొలి నుంచీ మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చే కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి.
మొన్నటివరకు పది, పన్నెండు, 26.. ఇలా కేసులు నమోదుకాగా, తాజాగా ఒక్కసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు మూడు రోజులుగా దాదాపు వెయ్యి పరీక్షలు నిర్వహించడంతోనే కేసుల సంఖ్య పెరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే, ఇన్నాళ్లూ తాము తక్కువ పరీక్షలు చేసిన విషయాన్ని వారే అంగీకరించినట్టయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ చాలా వెనకబడే ఉంది. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ వద్ద ప్రస్తావించినా.. తాము ఎవరికి పడితే వారికి పరీక్షలు చేయబోమని స్పష్టంచేశారు. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారికి పరీక్షలు నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
ఇక హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, మద్యం షాపులు తెరవడంతో సమస్య తీవ్రత ఎక్కువైంది. మద్యం షాపులకు అనుమతి ఇచ్చే అంశాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగానే వ్యతిరేకించినట్టు సమాచారం. రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కానీ రాష్ట్రం మొత్తంలో మద్యంపై ఎక్కువ ఆదాయం వచ్చేది హైదరాబాద్ నుంచే. పైగా ఇతర జిల్లాల్లో అనుమతి ఇచ్చి, హైదరాబాద్ లో ఇవ్వకుంటే మద్యం కోసం జిల్లా సరిహద్దులు దాటడానికి ప్రజలు ప్రయత్నిస్తారని భావించి.. రాష్ట్రం మొత్తం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మద్యం కొనుగోలు కోసమంటూ భారీ స్థాయిలో జనాలు రోడ్డెక్కేశారు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయంటే.. వాహనాలు ఎలా తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఫలితంగా ఇప్పటివరకు తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా.. ఒక్కసారిగా జూలు విదిల్చినట్టయింది. ఇదే ఒరవడి కొనసాగితే హైదరాబాద్ లో కేసులు నమోదు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సీఎం కేసీఆర్ సైతం కరోనాతో కలిసి జీవించక తప్పదని మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంటే రాబోయే కాలంలో కరోనాతో సావాసం చేయక తప్పదని ఆయన నిర్ధారణకు వచ్చేశారు. ఇక ప్రజలు ఆ దిశగా అప్రమత్తం కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
Media bulletin
Date: May 11, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/NrEDKycKXl
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 11, 2020
690118 595887hi this post assist me full . .should you want watches males pay a visit to my internet sites is very assist you for males watches. .thank man excellent job. 338181
483045 957338Thank you pertaining to giving this excellent content on your web-site. I discovered it on google. I may check back once again should you publish extra aricles. 66985