తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో మరోసారి కోరలు చాస్తోంది. దీంతో కోవిడ్ రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతుండటంతో పడకలన్నీ నిండిపోతున్నాయి. గత వారం నుంచే కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కోవిడ్ రోగుల వెయిటింగ్ లిస్టు కూడా ఏర్పాటు చేయగా.. మరికొన్ని ఆస్పత్రులు పడకల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టాయి. మరోవైపు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులకూ రోగుల తాకిడి ఎక్కువైంది. గాంధీ, టిమ్స్, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో కరోనా అడ్మిషన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో కూడా మళ్లీ కరోనా వైద్యసేవలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గతేడాది కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులు దాదాపు 100 నుంచి 300 వరకు కరోనా పడకలు ఏర్పాటు చేశాయి. అక్టోబర్ నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆ మేరకు తగ్గించుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో 50 లోపు మాత్రమే కరోనా పడకలు ఉన్నాయి. అయితే, గత వారం పది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రోగుల తాకిడి పెరిగింది. దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు మళ్లీ పూర్తిస్థాయిలో కరోనా పడకలు ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ రోగులు వస్తుండటంతో వెయిటింగ్ లిస్టు కూడా ఏర్పాటు చేశాయి. కరోనా నుంచి కోలుకుని ఎవరైనా డిశ్చార్జి అయితే, ఆ బెడ్ ను వెయిటింగ్ లిస్టులో వరుస క్రమంలో ఉన్నవారికి కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో జనాలు ఎవరికివారు కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
751152 856575Some genuinely marvellous function on behalf of the owner of this internet internet site, utterly outstanding content material. 927753