Switch to English

కరోనా అలర్ట్‌: ఇండియాలో లాక్‌డౌన్‌ అట్టర్‌ ఫ్లాప్‌.. అంతేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నటించాయి.. ప్రజలు లాక్‌ డౌన్‌ పాటిస్తున్నట్లు నటించారు..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా మీమ్స్ కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా తీవ్రతపై సెటైర్లు వేసుకునే సమయమా ఇది.? కానే కాదు. అయితే, కేంద్రం కరోనా విషయంలో చెబుతున్న లెక్కలు ఇటీవలి కాలంలో ఏమంత నమ్మశక్యంగా కన్పించడంలేదు.

‘ఒకవేఫళ లాక్‌డౌన్‌ పాటించకపోయి వుంటే.. ఇన్ని లక్షల మంది కరోనా బారిన పడి వుండేవారు.. ఇన్ని వేల మంది చనిపోయి వుండేవారు.. లాక్‌ డౌన్‌ వల్లనే గణనీయంగా నష్టం తగ్గించగలిగాం..’ అని చెబుతోంది కేంద్రం. కానీ, కరోనా వైరస్‌ ఇప్పటికే దేశంలో లక్షా ముప్పయ్‌ వేల మందికి సోకింది. మరణాలు నాలుగు వేలకు చేరుకుంటున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత అనూహ్యంగా పెరుగుతోంది.

ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 6 వేలు దాటేసి.. ఏడు వేలుకు చేరవవుతోంది. నాలుగైదు రోజులకోసారి సీన్‌ నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్ళిపోతోందంటే, కరోనా ఎంత వేగంగా దేశంలో విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. మరి, లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగమేంటి.? దీనికి సమాధానంగా, ‘సన్నద్ధతకు అవకాశం దొరికింది కదా.!’ అని అంటున్నారు కొందరు నిపుణులు.

కరోనాని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు తగు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు దొరికింది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్ని మాత్రం ఈ విషయంలో ప్రత్యేకంగా చూడాల్సి వుందన్నది మేదావి వర్గం చెబుతున్న మాట. మహారాష్ట్ర ఒక్కటే కాదు, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. జూన్‌ 21 నాటికి కరోనా కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందన్నది ఓ సర్వే చెబుతున్న విషయమైతే.. కాదు కాదు, జులై – ఆగస్ట్‌ నెలల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులుంటాయని ఇంకో సర్వే చెబుతోంది. ఏది నమ్మాలి.? ఏది నమ్మకూడదు.?

ఒక్కటి మాత్రం నిజం.. కేంద్రం లాక్‌డౌన్‌ విషయంలో ఏం చెప్పిందో, రాష్ట్రాలు దాన్ని పాటించాయి. అది కొద్ది మందిని మినహాయిస్తే, మెజార్టీ ప్రజానీకం లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించారు. ఇంత పెద్ద దేశంలో చోటు చేసుకున్న అతి తక్కువ ఉల్లంఘనల్ని బూతద్దంలో చూడాల్సిన పనిలేదు. ఎక్కడో లోపం జరిగింది. అది కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపమేనని అనుకోవాలేమో.

ప్రధానంగా మద్యం దుకాణాల్ని తెరవడం అనేది ఈ సమయంలో చారిత్రక తప్పిదంగానే చూడాలి. ఆ తర్వాతే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందన్నది మెజార్టీ అభిప్రాయం. మొత్తంగా చూస్తే, తాజా గణాంకాలు దేశంలో ‘లాక్‌ డౌన్‌’ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...