కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉంటుందని గత ఏడాది శాస్త్రవేత్తలు చెప్పిన సమయంలో సామాన్యులతో పాటు ప్రభుత్వం కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అప్పుడు శాస్త్రవేత్తలు చెప్పినట్లుగానే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా హెచ్చరిక ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది.
కేంద్రం చెబుతున్న దాని ప్రకారం రాబోయే నాలుగు వారాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాబోయే నాలుగు వారాలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ముందస్తుగా సమాయత్తం చేసేందుకు గాను కేంద్రం రాష్ట్రాల కు సంబంధించిన అధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఇక పీఎం నరేంద్ర మోడీ కూడా ముఖ్య మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలి.
668896 62227I gotta favorite this website it seems really beneficial . 83803