Switch to English

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది కొత్త విషయం కాదు. చాలా ఏళ్ళుగా నడుస్తున్న తంతు ఇది.
వృద్ధాప్య పెన్షన్ల దగ్గర్నుంచి, చాలా వ్యవహారాల్ని ‘సంక్షేమం’ కోటాలో వేసేస్తున్నాం. ఆ ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం ఎక్కువ సంక్షేమం చేస్తుంది. ఈ ప్రభుత్వం కంటే, తర్వాతి ప్రభుత్వం ఇంకా ఎక్కువ సంక్షేమం చేస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఓటర్లకు ఈ విషయమై ఖచ్చితమైన అభిప్రాయం వుంది.

చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటిల్లో కొన్నిటిని వైసీపీ రద్దు చేసింది, వాటి స్థానంలో కొత్త సంక్షేమ పథకాల్ని అమలు చేసింది. చంద్రబాబు కంటే ముందు కాంగ్రెస్ హయాంలోనూ సంక్షేమ పథకాలు నడిచాయి. సంక్షేమం అంటే, జనాల్ని సోమరిపోతుల్ని చేయడం.. అన్న వాదన ఎప్పుడూ వుంటుంది.
తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి కేసీయార్ హయాంలో. కానీ, కేసీయార్ మూడోసారి అధికారంలోకి రాలేకపోయారు కదా.! సంక్షేమం ఒక్కటే కొలమానం కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
ఇంతకీ, ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లలో ఎంతమంది సంక్షేమానికి సానుకూలంగా ఓటేసినట్టు.? ఇది చెప్పడం కష్టం. ‘వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ మూడు వేలు.. చంద్రబాబు హయాంలో అది నాలుగు వేలు కాబోతోంది..’ అన్న ప్రచారం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. అంతే కాదు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా జనాల్లోకి బాగానే వెళ్ళింది.
రాష్ట్ర రాజధాని సహా అనేక అంశాల గురించి గ్రామ స్థాయిలో చర్చ జరిగింది. అదీ, సంక్షేమ పథకాల లబ్దిదారుల్లోనే. మద్య నిషేధం వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. వాట్ నాట్.. ప్రజలు అన్నీ సమీక్షించుకున్నారు. నేరుగా తమ ఇంటి వద్దకు వాలంటీర్లు వచ్చి, సంక్షేమ పథకాలు అందిస్తుండడం దగ్గర్నుంచి కొన్ని సానుకూలతలు వైసీపీ చెబుతున్నట్లు వున్నాయ్.
ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని కూటమి చెప్పలేదు కదా.? పైగా, వాలంటీర్లకు రెట్టింపు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించేశారాయె. ఇలా చెప్పుకుంటూ పోతే, వైసీపీ మేనిఫెస్టో కంటే, చంద్రబాబు మేనిఫెస్టోనే (బీజేపీ బలపరిచిన టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టో) ఓటర్లను ఒకింత ఎక్కువ ఎట్రాక్ట్ చేసింది.

దాంతో, సంక్షేమ పథకాల లబ్దిదారులు, వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు బాగానే వచ్చాయ్.. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా అంతే. ఈసారి ఇంకాస్త ఎక్కువ సంక్షేమం వైపు మొగ్గు చూపుతున్నాం.. అని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటర్లు అభిప్రాయపడటం కనిపించింది.

పోలింగ్ తర్వాతి రోజు, వివిధ వర్గాల ప్రజలు, కూటమికి అనుకూలంగా ఓటేయడానికి చెప్పిన ప్రధాన కారణాల్లో ఇవి కొన్ని మాత్రమే. రోడ్ల మీద గుంతలు వైసీపీకి ప్రతికూలంగా మారాయన్నది వైసీపీ సానుభూతిపరులు చెప్పినమాట. ఇలా కీలకమైన విషయాల్ని జనం బాగానే గుర్తుపెట్టుకుని ఓట్లేసినట్లు కనిపిస్తోంది.

అలాగని, సంక్షేమం ద్వారా అస్సలు ఓట్లు రావని కూడా అనేయలేం.! సంక్షేమం దారి సంక్షేమానిదే.. సమస్యల దారి సమస్యలదే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం గ్రామ స్థాయిలో వైసీపీకి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.

మొత్తంగా చూస్తే, వైసీపీ చెబుతున్నట్లు, సంక్షేమం వైసీపీకి తిరిగి అధికారం తెచ్చిపెట్టే పరిస్థితే లేదన్నది నిర్వివాదాంశం. ‘మేం సంక్షేమం ఇచ్చాం.. ఓటర్లు మాకే ఓటెయ్యాలి..’ అని వైసీపీ ఇంకా మూర్ఖత్వం ప్రదర్శిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

Chiranjeevi: అలుపెరుగని చిరంజీవి కీర్తి.. అదొక ప్రవాహం

Chiranjeevi: ఎంత చెప్పుకున్నా.. ఎంతెంత చదివినా.. మరెంత తెలుసుకున్నా.. చిరంజీవి జీవితం నిత్యనూతనం. సినీ ప్రస్థానం, సమాజ సేవలో సాధించిన విజయాలు, సంపాదించిన కీర్తి, అందుకున్న పురస్కారాలు ఇందుకు నిదర్శనం. జీవిత సాఫల్య...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది : నాని

ఓ పక్క హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా కొత్త కథలతో వస్తున్నాడు నాని. లేటెస్ట్ గా నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఏ...