అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీహెచ్ బీ గృహ నిర్మాణాల చార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని సీఎం ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనపై తప్పుడు అభియోగాలు మోపిందని ఈ సందర్భంగా సీఎం తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా తన పేరు తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. సీఎం జగన్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ వారం గడువు కోరింది. ఇదే కేసులో పెన్నా చార్జిషీట్ లో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, రాజగోపాల్ వేసిన డిశ్చార్జి పిటిషన్లను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
375694 513849Fantastic post man, maintain the good function, just shared this with the friendz 529637