చట్ట సభలంటే ప్రజా ప్రతినిథులకు ఎంత గౌరవం వుందో చాలా చట్ట సభల్లో చూస్తూ వచ్చాం. తాజాగా, మంత్రి పేర్ని నాని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో బూతుల పర్వంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. మాజీ మంత్రి, టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడిని విమర్శించే క్రమంలో ‘నీ.. డాష్..’ అంటూ రాయడానికి వీల్లేని భాషని సభలో ఉపయోగించడం గమనార్హం.
అదే సమయంలో, అక్కడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వున్నారు. పైగా, పేర్ని నాని మాట్లాడుతున్న సమయంలో, ముఖ్యమంత్రి నవ్వలు చిందిస్తూ కన్పించారు. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత కొడాలి నాని మధ్య ఈ తరహా సంవాదమే చోటు చేసుకుంది.
అప్పటి వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఇలాగే నోరు పారేసుకున్నారు బూతులతో. రోజా సైతం జుగుప్సాకరమైన ప్రవర్తనతో అసెంబ్లీ సమావేశాలకు కొన్నాళ్ళు దూరమైన విషయం విదితమే. సాక్షాత్తూ మంత్రిగారు బూతులు మాట్లాడటం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. తెలంగాణ అసెంబ్లీలో అప్పటి మంత్రి జగదీశ్వర్రెడ్డి ఇలాగే నోరు జారితే, ఆ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్గా స్పందించారు. మంత్రి జగదీశ్వర్రెడ్డితో సభకు క్షమాపణ చెప్పించారు.
కానీ, ఇక్కడ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో, మంత్రిగారు బూతుల పురాణం అందుకుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముసిముసి నవ్వులు నవ్వారు. మరోపక్క, అచ్చెన్నాయుడికీ – స్పీకర్ తమ్మినేని సీతారాంకీ మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకోవడం అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన పరిణామం. స్పీకర్ సంయమనం కోల్పోవడమనేది అరుదుగా జరుగుతుంటుంది. కానీ, ఆయన తీరు ఈ రోజు ఒకింత ఆశ్చర్యకరంగానే తయారైంది. స్పీకర్ ఇంతలా ఆవేశపడ్డం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.
746860 330609Amazing post is going to be posting this on my blog today maintain up the good function. 660269