కోవిడ్ అనే పదమే ప్రస్తుతం అందరిని వణికిస్తుంది. రాజు నుండి బంటు వరకు అందరిని భయపెడుతున్న కోవిడ్ 19 మానవత విలువలను సైతం మంటకలిపినట్లుగా జనాలు ప్రవర్తించేలా చేస్తుంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. కరోనాతో మృతి చెందిన ఒక వ్యక్తి మృతదేహంను ప్రొక్లెన్ సాయంతో తొలగించే పక్రియా చాలా మందికి కన్నీరు తెప్పించింది. మరీ ఇంతటి దారుణమైన చావు ఎవరికి రావద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలాసలో జరిగిన ఘటన ఏపీ సీఎంఓ అధికారుల దృష్టికి వచ్చింది. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో ఆ విషయమై మాట్లాడటం జరిగిందట. ఘటనకు బాధ్యులు అయిన మున్సిపల్ కమీషనర్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ను సీఎంఓ ఆదేశించింది. కోవిడ్ కోసిక వారు మరియు మృతుల పట్ల వివక్ష చూపించవద్దంటూ ఇప్పటికే ప్రభుత్వం సూచించినా కూడా ఇలాంటి ఘటన జరగడం దారుణం అంటూ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ప్రభుత్వం సూచించింది.
కరోనా బాధితులపై కరుణ చూపండి.. వివక్షత కాదు..అని @ysjagan ఎంతగా చెబుతున్నా ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం .. ఇకనైనా ఇటువంటి అమానవత్వా ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ #ysrcp #YCP #AndhraFightsCorona #AndhraPradesh #jagan #YSJaganCares #YSJaganMarkGovernance https://t.co/OqdNn6tT2D pic.twitter.com/QPk39az5SV
— TeluguBulletin.com (@TeluguBulletin) June 26, 2020