ప్రముఖ నటుడు మోహన్ బాబు పై చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ 23 మెట్రోపాలిటన్ కోర్టు ఏడాదిపాటు శిక్షను ఖరారు చేసిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ విషయం పై మోహన్ బాబు స్పందించాడు. కావాలనే నాపై చెక్ బౌన్స్ కేసు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని అయన అన్నారు.
2009లో సలీం సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వై వి ఎస్ చౌదరికి చెల్లించేసాం. మా బ్యానర్ లో మరో సినిమా చేయడానికి అయనకు 40 లక్షల అడ్వాన్ చెక్ కూడా ఇచ్చాము . అయితే సలీం సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో వై వి ఎస్ చౌదరితో తరువాతి సినిమాను వద్దనుకున్నామన్నారు.
ఈ సినిమాను మనం చేయడం లేదని ఆయనకు కూడా చెప్పినట్టు, అలాగే ఆ చెక్ ని బ్యాంక్ లో వేయొద్దంటూ సమాచారం కూడా ఇచ్చామని మోహన్ బాబు పేర్కొన్నాడు. మేము చెప్పినా కూడా అయన కావాలనే ఆ చెక్ ని బ్యాంక్ లో వేసి బౌన్స్ చేసారని మోహన్ బాబు ఆరోపించారు. వారు తప్పుడు కేసు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారు .. కోర్టు కూడా వారిని అనుకూలంగా తీర్పు ఇచ్చిందని .. ఈ తీర్పుని సెషన్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని అన్నారు. కొన్ని ఛానల్స్ కావాలని తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని చెప్పారు.
3134 572183Thanks for your time so considerably for your impressive and incredible guide. I will not be reluctant to endorse your web web sites to any individual who need to receive direction on this dilemma. 8286
69900 537760Whoa! This blog looks just like my old 1! It is on a totally different subject but it has pretty considerably the same layout and design. Outstanding choice of colors! 769786
627668 386634Wow, suprisingly I never knew this. Keep up with very good posts. 187953
339091 283614Billiard can be a game which is mostly played by the high class men and women 617473
852783 611278Some actually superb information , Sword lily I located this. 469993