జగన్ సీఎం పదవికి రాజీనామా చేసి 3 రాజధానులపై ప్రజా తీర్పు కోరాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని విధ్వంసం చేయమని ప్రజలు అధికారాలు ఇచ్చారా..? ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధానికి అంగీకరించి.. ఇప్పుడు మూడు రాజధానుల గురంచి ఎలా మాట్లాడుతున్నారు’.
‘అమరావతి విషయంలో జగన్ నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. రాష్ట్రాన్ని పాలించే అధికారం జగన్ కు ఏమాత్రం లేదు. జగన్ మోహన్ రెడ్డి తన పేరును జగన్ మోసపు రెడ్డిగా మార్చుకుంటే మంచిది. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది పాలనా వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ విషయం తెలీని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరం’.
‘కోర్టు తీర్పులపై ఇంతగా మాట్లాడే సీఎం, మంత్రులను గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వాలు ఎలా ప్రవర్తించాలో రాజ్యంగంలో స్పష్టంగా ఉంది. ఇందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య స్పష్టంగా విభజించారు కూడా. ప్రభుత్వాలు చట్టాలు చేస్తే అమలు చేయాల్సింది కార్యనిర్వాహక వర్గానిదే. బాధ్యతలు విస్మరిస్తే సరిచేసే బాధ్యత న్యాయవ్యవస్థకు ఉంది’ అని అన్నారు.
488771 973068Informative Site Hello guys here are some links that contains information that you might find useful yourselves. Its Worth Checking out. 13049
439162 31131I feel this web website has got extremely wonderful indited written content articles . 423497
253653 865215Im not that significantly of a internet reader to be honest but your blogs genuinely good, keep it up! Ill go ahead and bookmark your internet site to come back in the future. All of the very best 312014