లేటెస్ట్ గా విడుదలైన మజిలీ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత కలిసి నటించిన సినిమా కావడంతో అటు భారీ అంచనాలు పెంచుకుంది. చైతు, సమంత పెళ్ళికిముందు నుండే జోడిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ జంట అలా ప్రేమలో పడి ఈ మధ్యే పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తరువాత నటించిన మొదటి సినిమా మజిలీ. సినిమా విడుదలకు ముందు వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను నిజం చేసారు. అద్భుతమైన భావోద్వేగాల్ని పండించారు. మజిలీ ఇచ్చిన ఉత్సహంతో ఈ జోడి మళ్ళీ మళ్ళీ కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ జోడి మరోసారి నటించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ దర్శకుడు చైతు, సామ్ లకు కథ కూడా వినిపించాడట. కథ నచ్చడంతో వారిద్దరూ ఓకే చెప్పినట్టు టాక్. మజిలీ సినిమా ఇచ్చిన ఉత్సహంతో చై, సామ్ మరోసారి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రియల్ కథకు ఫిక్షన్ జోడించి సంచలన చిత్రంగా ఆర్ ఎక్స్ 100 ని తెరకెక్కించి అటు విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు అజయ్ భూపతి. అలాగే ఈ సినిమాకోసం మరో కొత్త కథను సిద్ధం చేసాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడట దర్శకుడు అజయ్. ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లోనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషాయంలో నిజానిజాలు ఏమిటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.
