డాక్టర్ సుధాకర్.. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళిత డాక్టర్ ఉదంతంలో కుట్ర కోణాన్ని సీబీఐ తేల్చి చెప్పింది. కుట్రలో అసలు కోణాన్ని వెలికి తీయడానికి ఇంకాస్త సమయం కావాలంటూ సీబీఐ, రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం మరో రెండు నెలల గడువు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ ‘అనస్తీషియన్’గా పనిచేసిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో మాస్క్లు, పీపీఈలు కావాలని ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో, తన ఆవేదనను ఓ వీడియో రూపంలో ఆయన బయటకు తీసుకురావడం, ఈ క్రమంలో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెల్సిన విషయాలే. మరోపక్క, మద్యం తాగి రోడ్డు మీద నానా యాగీ చేస్తూ, ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ పోలీసులకు చిక్కారు డాక్టర్ సుధాకర్.
అయితే, తాను ప్రభుత్వాన్ని పీపీఈ కిట్లు, మాస్క్లు అడగడంతో తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారనీ, ఈ క్రమంలోనే తనను పిచ్చివాడిగా చిత్రీకరించారని డాక్టర్ సుధాకర్ మొరపెట్టుకున్నారు. ఈ ఉదంతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యింది. దాంతో, హైకోర్టు అంశంపై సీరియస్గా స్పందించి, సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఇంతకీ, డాక్టర్ సుధాకర్కి గుండు కొట్టిందెవరు.? నడి రోడ్డు మీద ఆయన్ని అర్థనగ్నంగా మార్చిందెవరు.? అతనిపై ఎందుకు దాడి జరిగింది.? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి వుంది.
వైద్య చికిత్స నిమిత్తం ఆయన్ని ఆసుపత్రికి తరలించి.. అక్కడా ఆయన్ని పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కొన్ని మందుల్ని ఇచ్చారనే ఆరోపణలూ వున్నాయి. ఈ నేపథ్యంలో కేసు తీవ్రతను గుర్తించిన సీబీఐ, మరింత లోతైన విచారణ కోసం న్యాయస్థానాన్ని అదనపు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. ఒక డాక్టర్కి.. అందునా ఓ దళితుడికి ఇంత అన్యాయం జరిగితే.. ప్రభుత్వ పెద్దలు ఆయన మీద ‘రాజకీయ ఆరోపణలు’ చేయడం హాస్యాస్పదం. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలతాయని విపక్షాలు, ప్రజా సంఘాలు భావిస్తున్నాయి.
518551 140572Woh I like your content material , saved to bookmarks ! . 136278
180138 187121Just what I was searching for, appreciate it for posting . 372149