లాక్ డౌన్ అనంతరం రాకపోకలన్నీ మొదలై జనాలు సాధారణంగానే తిరుగుతున్నా రవాణా వ్యవస్థ మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. జిల్లాల్లో బస్సులు తిరుగుతున్న నగరాల్లో మాత్రం సిటీ బస్సులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సిటీ బస్సులు చాలా తక్కువగా తిరుగుతున్నాయి. మెట్రో రైలు నడుస్తున్నా.. అది లేని ప్రాంతాల ప్రజలు ఆటోలు, క్యాబ్ లను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో క్యాబ్ లేదా ఆటో ప్రయాణం చాలా కాస్ట్ లీగా మారిపోయింది. దాదాపు 50 శాతం నుంచి 80 శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది. ప్రయాణికుల డిమాండ్, క్యాబ్ ల లభ్యతను ఆధారంగా చేసుకుని ఈ మేరకు రేట్లు పెంచేసినట్టు తెలుస్తోంది. మణికొండ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే గతంలో దాదాపు రూ.350 అయ్యేది. ఇప్పుడది ఏకంగా రూ.550కి పెరిగింది. అదే ఆటోలో వెళితే రూ.వంద నుంచి రూ.120 చార్జి చేసేవారు. ఇప్పుడది రూ.200 నుంచి రూ.220 అవుతోంది.
సాధారణంగా హైదరాబాద్ లో ప్రతిరోజూ దాదాపు 30 లక్షల మంది సిటీబస్సులు, ఎంఎంటీఎస్ లలో ప్రయాణిస్తారు. గతంలో అటు బస్సులు, ఇటు రైళ్లతోపాటు ఆటోలు, క్యాబ్ లు బాగా అందుబాటులో ఉండేవి. అయితే, లాక్ డౌన్ తర్వాత ఇవేవీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. దాదాపు 3వేల సిటీ బస్సులు గతంలో తిరిగేవి. ప్రస్తుతం వెయ్యి కూడా అందుబాటులో లేవు. మెట్రో రైలు నడుస్తున్నా.. ఎక్కువ మంది ప్రయాణించే ఎంఎంటీఎస్ సేవలు ఇంకా మొదలు కాలేదు.
అదే సమయంలో గతంతో పోలిస్తే క్యాబ్ ల సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో క్యాబ్ సంస్థలు ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. ఇక ఆటోల సంగతి చెప్పక్కర్లేదు. దీంతో నగరంలో ప్రయాణమంటేనే సగటు జీవి భయపడే పరిస్థితి నెలకొంది.
481224 541582Oh my goodness! an wonderful article dude. Thanks a ton Nonetheless I will be experiencing difficulty with ur rss . Do not know why Not able to join it. Can there be every person acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 971852