చైనాను కరోనా వైరస్ కుదిపేస్తుంటే… ఇండియాను సిఏఏ అతలాకుతలం చేస్తున్నది. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఈ సిఏఏ ర్యాలీలు ఇప్పుడుదేశంలోని గల్లీ గల్లీకి పాకాయి. సిఏఏ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండదని అనుకున్నారు. తెలంగాణలో ముస్లింల జనాభా అధికం కాబట్టి అక్కడ అధికంగా ఉంటుంది. తెలంగాణతో పోలిస్తే ఎపిలో తక్కువ కాబట్టి అక్కడ ఆ పరిస్థితులు ఉండవని అనుకున్నారు.
కానీ, ఏపీలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు జగన్ చెప్పినట్టుగా నడిచిన రాజకీయాలు ఇప్పుడు టీడీపీ చెప్పినట్టుగా నడుస్తాయేమో అనిపిస్తోంది. సిఏఏ అన్నది చాలా సున్నితమైన అంశం. మతాలతో సంబంధం లేని విషయాన్ని, మసిపూసి మతాలకు అన్వయం చేశారు. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. మొదటి నుంచి సిఏఏ ను వ్యతిరేకిస్తూ వస్తున్న అక్బరుద్దీన్ ఒవైసి మొన్నటి రోజున విజయవాడలో భారీ సభను నిర్వహించారు.
ఈ సభకు కేశినేని నాని హాజరు కావడం షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. అంతకు ముందు కూడా బాబు బీజేపీతో పొత్తు నుంచి బయటకు రావడంతో దెబ్బ పడింది అని చెప్పకనే చెప్పారు. అందుకే కేంద్ర బిల్లుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కానీ, ఆ పార్టీలకు చెందిన ఎంపీ మాత్రం అసదుద్దీన్ ఒవైసి తో కలిసి సిఏఏ వ్యతిరేకంగా జరిగిన సభలో పాల్గొనడం టీడీపీ వర్గాలను ఆలోచనలో పడేశాయి.
ఇపుడు టీడీపీ బిల్లును వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగకుండా అడ్డుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం వలన వైకాపాకు వచ్చిన నష్టం ఉండకపోవచ్చు. కేంద్రానికి వ్యతిరేకంగా టీడీపీ నిర్ణయాలు తీసుకున్నట్టు అవుతుంది. దాని వలన పార్టీతో పాటుగా బాబుకూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అసలే ఇప్పుడు బాబు చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుసుకుంటోంది. బాబుగారు కాస్త ఆలోచించుకోండి.
603293 945672Youre so proper. Im there with you. Your weblog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a whole new view of this. I didnt realise that this concern was so important and so universal. You absolutely put it in perspective for me. 369223