Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: స్మశానంలో.. ఎడారిలో పేదలకు ఇళ్ళ స్థలాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అమరావతి కాదది భ్రమరావతి.! అమరావతో హైమావతో ఎవరికి తెలుసు.! అమరావతి ఎడారిని తలపిస్తోంది.! అమరావతి – స్మశానం.! ఇలా చెప్పుకుంటూ పోతే, అమరావతి చుట్టూ చాలా రాజకీయాలు నడిచాయి. అమరావతి మునిగిపోతుందన్నారు.. అమరావతిలో భూకంపాలు వస్తాయన్నారు.. అమరావతి కార్పొరేట్‌ రంగానికి చెందిన బడా బాబులకు తప్ప, సామాన్యులకు కానే కాదన్నారు. గడచిన ఐదేళ్ళుగా ఇదే తంతు.! ఏ అమరావతిని అయితే స్మశానం అన్నారో, ఏ అమరావతిని ఎడారి అన్నారో.. అక్కడి నుంచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పరిపాలన చేస్తోంది.

ఆ అమరావతిని కాలగర్భంలో కలిపేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఓ పక్క అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటూనే, అమరావతిలో నిర్మాణంలో వున్న భవనాల పనుల్ని కొనసాగించేందుకు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా.! ఇదిలా వుంటే, అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకోసం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సరికొత్త ప్లాన్‌ సిద్ధం చేసింది. కృష్ణా జిల్లాతోపాటు, గుంటూరు జిల్లాకి చెందిన పేదలకు అమరావతిలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నదే ఆ ప్లాన్‌.

అమరావతిలో ‘ల్యాండ్‌ బ్యాంక్‌’ వుంది గనుక, దాన్ని ఇలా వినియోగిస్తారన్నమాట. నిజానికి, పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం ఇస్తామని చెబితే ఎవరు కాదంటారు.? కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితేనే, అమరావతిలో రైతులు, ప్రభుత్వానికి తమ భూముల్ని ఇచ్చారు. కానీ, అలా రైతులు ఇచ్చిన భూముల్ని, పేదల ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తామనడమేంటి.? ఇదే ప్రశ్న సంధిస్తూ, భూముల్లో సర్వే కోసం వస్తున్న అధికారుల్ని రైతులు నిలదీస్తున్నారు.

ప్రభుత్వం అట్టహాసంగా పేదలందరికీ ఇళ్ళ స్థలాల కార్యక్రమం చేపట్టింది. ఉగాదిని డెడ్‌లైన్‌గా పెట్టుకుంది కూడా. కానీ, రాష్ట్రంలో తగిన స్థాయిలో భూ లభ్యత లేక నానా తంటాలూ పడ్తోంది ప్రభుత్వం. సరిగ్గా ఈ సమయంలోనే అమరావతి భూములు ప్రభుత్వానికి అప్పనంగా దొరికినట్లయ్యింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారికి మాత్రమే ఎందుకు.?

రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన పేదలకీ ఇక్కడే భూములు ఇచ్చేయొచ్చు కదా.? అన్న సెటైర్లు ప్రభుత్వం మీద పడుతున్నాయి. మొత్తమ్మీద, ‘స్మశానం – ఎడారి’ అని చెప్పిన ప్రభుత్వ పెద్దలే, అమరావతిని ఇప్పుడు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారు. అయినా స్మశానంలోనూ, ఎడారిలోనూ, మునిగిపోయే ప్రాంతంలోనూ, భూకంపాలు వచ్చే ప్రాంతంలోనూ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడమేంటి.? అంటే, ప్రజల్ని ఏ కోణంలో ప్రభుత్వం చూస్తున్నట్లు.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...