ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయలసీమకు నీరందించే ఉద్దేశంతో ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు బ్రేక్ పడింది. తమకు చెప్పకుండా ఈ ప్రాజెక్టులో ముందుకెళ్లొద్దంటూ తాజాగా కృష్ణా బోర్డు ఏపీ సర్కారుకు లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం ఎవరు ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా, తొలుత తమకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని.. తాము దానిని కేంద్ర జలశక్తిశాఖకు, అపెక్స్ కౌన్సిల్ కు పంపిస్తామని పేర్కొంది. అక్కడ నుంచి ఆమోదం వస్తే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని వివరించింది. దీంతో ప్రస్తుతం టెండర్ దశకు చేరిన ఈ ప్రాజెక్టు ఆగిపోవాల్సి వచ్చింది.
నిజానికి సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జల వివాదాలను మనమే పరిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ సూచించారు. బేసిన్లు, భేషజాలు లేకుండా చూసుకుందామని పేర్కొన్నారు. కేంద్రం వద్దకు పంచాయతీకి పోయే ప్రసక్తే లేదన్నారు. అయితే, జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడం.. పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం వంటి మొదలుపెట్టడంతో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. నాలుగేళ్ల తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆగస్టు 5న జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ పాల్గొంటారు. ఈ సందర్బంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అభ్యంతరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం భవితవ్యం కూడా ఆ రోజు తేలే అవకాశం ఉంది.
598810 179401I saw plenty of internet site but I think this one contains something special in it in it 331978