సత్యం రామలింగరాజు స్టోరీ గుర్తుందా? సంస్థ లాభాలను ఎక్కువ చేసి చూపించి మదుపరులను మోసం చేసి జైలుపాలయ్యారు. చివరకు సత్యం సంస్థే మరో సంస్థలో కలిసిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి వ్యవహారమే మరొకటి తెరపైకి వచ్చింది.
భగవత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి.. అబుదాబీలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు. ఎంఎన్ సీ హెల్త్ కేర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా 8 దేశాల్లోని 12 నగరాల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేసిన ఆయన అనతి కాలంలోనే ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఈయన గురించి మనకెందుకంటారా? టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు అమరావతిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున వంద ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. అక్కడ హోటల్స్, ఆస్పత్రులు, ల్యాబ్ లతో మెడికల్ సిటీ కట్టేస్తానని అప్పటి ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకున్నారు. అలా చాలా విలువైన భూములను చాలా తక్కువ ధరకు చేజిక్కించుకున్నారు. పోనీ అందులో ఏమైనా కట్టారా అంటే ఇప్పటివరకు ఏమీ లేదు.
ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ నేతృత్వంలోని ఏపీ ఎకనామిక్ బోర్డే ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించింది. ఈ నేపథ్యంలో ఈ శెట్టిగారి ఎంఎన్ సీ హెల్త్ కేర్ సంస్థ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. సంస్థ ఆస్తులను ఎక్కువ చేసి చూపించారని, శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని తేలింది. చివరకు తన వాటా షేర్లను కూడా బ్యాంకులకు తనఖా పెట్టిన సంగతి బయటపడింది. దీంతో ఎంఎన్ సీ షేర్ ధర ఏకంగా 70 శాతం పడిపోయింది.
అచ్చం సత్యం సంస్థ వ్యవహారంలాగనే ఇక్కడ కూడా కథ నడిచింది. ఇన్వెస్టర్లు ఆందోళన చేయడంతో కంపెనీ కీలక బాధ్యతల నుంచి శెట్టి తప్పుకున్నారు. అలాంటి వ్యక్తికి అమరావతిలో అప్పనంగా ఇచ్చిన వంద ఎకరాల భూమిని జగన్ సర్కారే ఏం చేస్తుందో చూడాలి.
394770 753911Informative Site Hello guys here are some links that contains information that you might uncover valuable yourselves. It is Worth Checking out. 62345