భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. అవకాశాల్ని సాధించుకోవడంలో ఎంతో పరిణితితో వ్యవహరించే ఆ పార్టీ.. తాజాగా అంది వచ్చిన అవకాశాన్ని సైతం చేజేతులా జారవిడుచుకుంది. మహారాష్ట్రలో అధికారం కైవసం చేసుకునే విషయంలో బోల్తాపడ్డ కమలనాథులు.. తెలంగాణలో తలెత్తిన ఆర్టీసీ సంక్షోభాన్ని పరిష్కరించి ప్రజల్లో పరపతి తెచ్చుకునే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ సమ్మె చేసినా కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో కార్మికుల కుటుంబాలతోపాటు ప్రజల్లోనూ కాస్త అసంతృప్తి చోటుచేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వంపై పైచేయి సాధించే అవకాశం దక్కింది.
ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్నందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని సమ్మెకు పరిష్కారం చూపినట్టయితే, రాష్ట్రంలో బలపడాలన్న కమలనాథుల ఆశ ఎంతో కొంత కచ్చితంగా తీరి ఉండేది. కానీ ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తాం అంటూ ప్రకటనలకే పరిమితం కావడంతో సమస్య పరిష్కారం కాలేదు.
త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ఈ సమస్యపై సరిగ్గా స్పందించి ఉంటే రాష్ట్రంలో బీజేపీకి కచ్చితంగా లబ్ధి కలిగే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సమ్మె విషయాన్ని సీఎం కేసీఆర్ దాదాపు రెండు నెలలపాటు సాగదీశారని, ఆ సమయంలో ఏదో ఒకరోజు తాము కీలక నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని బీజేపీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టేందుకు తాము సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించి చాలా కార్యక్రమాలు చేశామని, కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ డ్యూటీల్లో చేరాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఒక్కసారిగా కార్మికుల దృష్టిలో ఆయన హీరో అయిపోయారని, తాము జీరోగా మిగిలిపోయామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
889888 635079I genuinely prize your piece of function, Fantastic post. 959485
125578 859589Greetings! Quick question thats completely off topic. Do you know how to make your website mobile friendly? My weblog looks weird when viewing from my iphone. Im trying to find a template or plugin that may well be able to fix this dilemma. In case you have any recommendations, please share. Appreciate it! 62511