Switch to English

టీఆర్ఎస్ పైనా కమలం మైండ్ గేమ్ షురూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో రాటుదేలిపోయిన బీజేపీ.. తెలంగాణలోనూ ఆ తరహా వ్యూహం మొదలుపెట్టింది. కర్ణాటకలో విజయవంతంగా రాజకీయాలు చేసి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ.. తాజాగా మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణపైనా కన్నేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసే సీన్ కాషాయదళానికి లేకున్నా.. భవిష్యత్తులో బలపడే దిశగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో కమలనాథులు పప్పులు ఇక్కడ ఉడకడంలేదు. అయితే, నెమ్మది నెమ్మదిగా పార్టీని విస్తరించి తదుపరి ఎన్నికల నాటికి బలీయం కావాలనే ఎత్తుగడతో కమలనాథులు ముందుకు కదులుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో టీడీపీ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన బీజేపీ.. అధికార టీఆర్ఎస్ పైనా మైండ్ గేమ్ మొదలుపెట్టింది.

ఆగస్టు రెండో వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో తమ వ్యూహానికి మరింత పదును పెట్టారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఎప్పుడైనా వారు బీజేపీలో చేరొచ్చంటూ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బాంబు పేల్చారు. కాంగ్రెస్, టీడీపీల నుంచే కాకుండా టీఆర్ఎస్ నుంచి కూడా నేతలు తమ పార్టీలోకి రానున్నారంటూ పేర్కొన్నారు.

‘‘కొంతమంది టీఆర్ఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీఆర్ఎస్ లో ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము గెలుపొందుతామో లేదో అనే అనుమానం వారిలో బలంగా ఉంది. వారంతా ఏ క్షణంలోనైనా బీజేపీలో చేరొచ్చు’’ అని పేర్కొన్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. తాము తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నామని చెప్పారు. తమ లక్ష్యం చేరుకునే వరకు ఆగే ప్రసక్తే లేదన్నారు.

ఒక ప్రతిపక్ష పార్టీ ఏమి చేయగలదో తాము చేసి చూపిస్తామని సవాల్ చేశారు. కేసీఆర్ సర్కారుకు ప్రత్యామ్నాయం కోరుకునేవారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే, బీజేపీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తోసిపుచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బ్రహ్మాండమైన పాలన సాగుతోందని, తమ ఎమ్మెల్యేల్లో అయోమయం సృష్టించేందుకే ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...