బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం షురూ అయిన ఈ సీజన్ లో మొదటి రోజు ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ పరిచయం జరిగింది. ఆ తర్వాత సోమవారం ఎపిసోడ్ నుండి అసలైన రచ్చ మొదలైంది. బిగ్ బాస్ అంటేనే గొడవలు అన్నట్లుగా సీజన్ లో కూడా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారంలోనే రచ్చ రంబోలా జరిగింది. అమ్మాయిలు, ఆడవారు, మగవారు అందరు కూడా ఈ సీజన్ లో రచ్చ చేసి పారేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ కాకుండా అందరు కూడా తెగ హడావుడి చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున నేడు కంటెస్టెంట్స్ ముందుకు వస్తాడు. వారికి క్లాస్ లు పీకబోతున్నాడు. ఆ విషయం పక్కన పెడితే తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది చూద్దాం పదండి..
ఎపిసోడ్ ఆరంభంతోనే పింకీ మరియు మానస్ ల మద్య మాటలు కలిశాయి. ఈ విషయమై బిగ్ బాస్ కంటెంట్ క్రియేట్ చేసేలా ప్రయత్నించాడు. రోజ్ ఇస్తూ ఇది నీ వద్దే ఉంచుకోవాలని ప్రియాంక అంటే తప్పకుండా అంటూ ఒక డబ్బాలో దాన్ని దాచుకున్నాడు. ఇద్దరి మద్య వ్యవహారం బాగానే ముందుకు సాగుతుంది అంటూ ప్రేక్షకులు ఒక అభిప్రాయంకు వచ్చేశారు. ఇక బిగ్ బాస్ మొదటి వారంలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ సాగింది. అందులో భాగంగా ఇద్దరిని ఎంపిక చేసుకుని ఒకరు ఎత్తుకుంటే మరొకరు కుండలను పగులకొట్టాలి. ఆ పని శ్రీరామ్ చంద్ర మరియు విశ్వలు చేశారు. నటరాజ్ మాస్టర్ ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను పట్టించుకోలేదు అంటూ అలిగాడు. రవి ఆయన్ను కాస్త సముదాయించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్ర ఎత్తుకోగా విశ్వ కుండలను బద్దలు కొట్టి లగ్జరీ బడ్జెట్ ను తీసుకున్నారు. లగ్జరీ బడ్జెట్ వస్తువులు రావడంతో ఇంటి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
వినాయక చవితి సందర్బంగా ఇంటి సభ్యులు అంతా కలిసి పూజ చేశారు. అందరు అందంగా తయారు అయ్యి కనిపించారు. పూజ సమయంలో యాంకర్ రవి, లోబో, నటరాజ్ మాస్టర్ ఇంకా కొందరు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో ఈ పండుగ చేసుకోలేక పోయాం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక పూజ పూర్తి అయిన వెంటనే బిగ్ బాస్ మొదటి వారం వరస్ట్ ఫెర్ఫార్మర్ మరియు బెస్ట్ ఫెర్ఫార్మర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో ఒకొక్కరు ఒక్కో విధంగా మాట్లాడాడు. ఎక్కువ శాతం మంది జెస్సీని వరస్ట్ ఫెర్మార్మర్ అనేశారు. బెస్ట్ అంటే విశ్వకు ఎక్కువ మార్కులు పడ్డాయి. దాంతో బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం వరస్ట్ ఫర్ఫార్మర్ అయిన జెస్సీకి జైలు తప్పలేదు. వరస్ట్ గురించి మాట్లాడిన సమయంలో ప్రియాంక కాస్త సీరియస్ గానే ఉమా పై వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే నోరుముయ్యి అంటూ సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో కాస్త హౌస్ సీరియస్ అయ్యింది. ఆ తర్వాత ప్రియాంక తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగింది. మొత్తానికి ఎపిసోడ్ 6 కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే సాగింది.
165824 374824As I web site owner I believe the articles here is rattling superb , thanks for your efforts. 526337