సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇంట్లోనే సేఫ్ గా ఉంటున్నారు. తన తర్వాత చిత్రాన్ని ప్రకటించినా కానీ ఇప్పుడిప్పుడే షూటింగ్ ను మొదలుపెట్టకూడదు అనుకుంటున్నారు. కుదిరితే నవంబర్ లేదా డిసెంబర్, పరిస్థితి ఎప్పుడు సద్దుమణిగితే అప్పుడు మహేష్ తర్వాతి సినిమా షూటింగ్ మొదలువుతుంది. మహేష్ బాబు తర్వాతి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెల్సిందే. దీనికి సర్కారు వారి పాట అనే టైటిల్ ను కూడా ప్రకటించారు.
షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దర్శకుడు పరశురామ్ ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కా ప్లానింగ్ తో టైమ్ తీసుకుని కానిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పాత్రలకు నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు పరశురామ్.
గత కొన్ని రోజుల నుండి ఈ సినిమాలో ప్రముఖ పాత్రకు నాటితరం అందాల నాయిక ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. 90లలో తన అందంతో, అభినయంతో ఇండియాను ఊపేసిన భాగ్యశ్రీ సర్కారు వారి పాటలో మహేష్ తల్లి పాత్ర పోషిస్తోందని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
సర్కారు వారి పాటలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైన విషయం తెల్సిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.
370836 993659I was trying to uncover this. Actually refreshing take on the info. Thanks a lot. 737611
567694 934589Thank you for your really excellent information and respond to you. 510157
410227 837071Thanks for all your efforts which you have put in this. quite fascinating information . 955572