Switch to English

అప్పుడు జగన్‌, ఇప్పుడు చంద్రబాబు.. తేడా ఏముంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించే సమయంలో నానా యాగీ జరిగింది. అప్పటి చంద్రబాబు సర్కార్‌పై అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని పేరుతో చంద్రబాబు భూ దందాకి తెరలేపారంటూ వైఎస్సార్సీపీ నేతలు నానా రకాల ఆరోపణలూ చేశారు. అయితే, ‘వీళ్ళు రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం.. ఇలాంటి ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా వుండదు.. అభివృద్ధి వ్యతిరేకులు.. రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు..’ అంటూ అప్పట్లో చంద్రబాబు సర్కార్‌, ప్రతిపక్షం వైఎస్సార్సీపీపై ఎదురుదాడికి దిగింది.

చేసేది లేక, అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జగన్‌, అమరావతికి మద్దతివ్వాల్సి వచ్చింది. పైకి మద్దతిచ్చినా, అమరావతికి వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతూనే వచ్చారు. ఎవరో ఒకరితో కోర్టుల్లో కేసులు వేయిస్తూ, అమరావతికి ఆటంకాలు కల్పించారు కూడా. ఇప్పుడు అదే పని తెలుగుదేశం పార్టీ చేయబోతోంది. మూడు రాజధానులపై అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జగన్‌ చూచాయిగా ప్రకటన చేశాక, రాష్ట్రంలో అలజడి బయల్దేరింది. రాయలసీమ ప్రాంత ప్రజలు, తమకే రాజధాని కావాలంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలేమో, రాయలసీమ మీద గుస్సా అవుతున్నారు. రాజధాని అమరావతిలో గందరగోళం సరే సరి.

ఈ మూడు ప్రాంతాల ప్రజల ఆవేదనపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారనీ, కేసులు వేసి మూడు రాజధానుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారనీ ఎదురుదాడికి దిగుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబు ఇష్టం లేదని విజయసాయిరెడ్డి కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

రాజధానితోనే విశాఖ అభివృద్ధి చెందే అవకాశం వుంటే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే విశాఖతోపాటు కర్నూలు కూడా రాజధానులుగా ప్రకటితమయ్యేవి. అంటే, వైఎస్‌ జగన్‌ ‘విజన్‌’ వున్న నాయకుడు, వైఎస్సార్‌ ఆ మాత్రం అవగాహన లేని నాయకుడన్నమాట విజయసాయిరెడ్డి దృష్టిలో.

అమరావతి విషయమై ఇప్పటికే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ముందు ముందు మరిన్ని పిటిషన్లు దాఖలవుతాయి కూడా. ఆ పరిస్థితిని ముందే ఊహించి, చంద్రబాబు మీదకి విమర్శనాస్త్రం విజయసాయిరెడ్డి సంధించేశారన్నమాట.

‘విజయసాయిరెడ్డి చెప్పింది నిజం కాదు. ప్రభుత్వం ఇంకా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోలేదు..’ అని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని, క్యాబినెట్‌ భేటీ వివరాలు చెబుతూ విజయసాయిరెడ్డి గాలి తీసేశాక, చేతనైతే విజయసాయిరెడ్డి, పేర్ని నాని వ్యాఖ్యల్ని తప్పు పడుతూ వైఎస్‌ జగన్‌కి ఫిర్యాదు చేయాలి. కానీ, అంత సీన్‌ విజయసాయిరెడ్డికెక్కడిది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...