Ayodhya: అయోధ్య (Ayodhya) లో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర. ఈక్రమంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందే శ్రీరాముడి విగ్రహ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇంతకుముందు కళ్లకు గంతలు కట్టి వున్న రాముడి విగ్రహాలు బయటకు వచ్చాయి. కానీ.. ఈసారి గర్భ గుడిలోకి చేర్చక ముందే కళ్లగంతలు లేని బాలరాముడు, చేతిలో బంగారు విల్లు, బాణం ఉన్న విగ్రహాలు బయటకు వచ్చాయి. వేద మంత్రాల మధ్య రాముడి విగ్రహాన్ని గర్భ గుడిలోకి చేర్చారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్.. 51 అంగులా పొడవు ఉన్న రామ్ లల్లా విగ్రహం తయారు చేశారు.
శ్రీరాముడి విగ్రహం ప్రాణం పోసుకున్నట్టు ఉందని చెప్పాలి. విగ్రహం భక్తుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. శ్రీరాముని దర్శించుకున్నాక మోదీ హారతి ఇస్తారని ట్రస్టు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరుగనుంది.