పేరు ప్రస్తావించడం ఎంతవరకు సబబు.? అన్న కోణంలో ఆమె పేరుని ప్రస్తావించలేకపోతున్నాం.! ఓ మహిళ చనిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కన్నీరు మున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.!
రాజకీయ వికటాట్టహాసం.! ఇది నిజానికి చాలా చాలా చిన్నమాట.! ఓ సంక్షేమ పథకం తాలూకు లబ్దిదారు ఆమె. ప్రభుత్వం గురించి మంచి మాటలు చెప్పింది. ఆమె చెప్పిందా.? చెప్పించారా.? అన్నది వేరే చర్చ. ఆమె చెప్పిన మాటల్లోని ‘పెయిడ్ కంటెంట్’ కొందరికి నచ్చలేదు. ఆమెను ట్రోల్ చేశారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? అధికారిక బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన రాజకీయ ప్రత్యర్థి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తున్నారు.. అత్యంత జుగుప్సాకరంగా. అలాంటిది, సోషల్ మీడియా ట్రోలింగ్ని ఎవరైనా అదుపు చేయగలరా.?
సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ వల్లనే సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడిందన్నది ఓ వాదన. కుటుంబ సమస్యలతో వేగలేక, రైలు కింద పడి చనిపోవడానికి ప్రయత్నించిందనీ, ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రి పాలై, చివరికి మృతి చెందిందన్నది ఇంకో వాదన.
నిజానిజాలేంటో విచారణలో తేలుతాయ్. ఈలోగా, రాజకీయం షురూ అయ్యింది. శవం దొరికితే చాలు, రాజకీయం చేయడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఆమె శవంతో రాజకీయం అలాగే చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని దోషులుగా చిత్రీకరించేందుకు అధికార వైసీపీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
మహిళల్ని దారుణంగా ట్రోలింగ్ చేసే (చట్ట సభల్లో కూడా) వైసీపీ, ఇప్పుడు నీతులు చెబుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
ఆమె మరణం అత్యంత బాధాకరం.! ఆమె మరణం తర్వాత నడుస్తున్న శవ రాజకీయం అత్యంత జుగుప్సాకరం.! శవం దొరికితే చాలు, రాజకీయం చేయాలనుకునే గోతి కాడి నక్కల్ని, రాజకీయ రాబందుల్ని.. ఏమనాలో కూడా పదాలు దొరకని పరిస్థితి.